Friday, May 26, 2017

సంపాదకీయం - May 2017 - Dalithashakthi


డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో చైతన్యవంతమవుతన్న దళిత, బహుజనులకు మనుధర్మ మరణశాసనం ద్వారా దళిత, బడుగు, బలహీన వర్గాలను మరింత అంధకారంలోకి తీసుకువెళ్ళుతున్నది. రాజ్యం మనుధర్మాన్ని అవలభించడం ద్వారా ప్రగతి పథంలో ప్రయాణించాల్సిన ఆధునిక భారతం ఆగధంలోకి వెళ్ళుతున్నా, పాలకుల పైశాచిక ఆనందం ముందు రాజ్యాంగ విలువలు మంట కలిసిపోతున్నాయి. రాజ్యాంగ సభలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మాట్లడుతూ ''రాజ్యాంగ ఎంత మంచిగా ఉన్న అమలు చేసేవారు బాగా లేకపోతే, అది చేడుగానే కనిపిస్తుందని'' చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. 
సామాజికార్థిక కారణాలతో విభజితమవుతున్న సమాజాలను మతతత్వానికి లోనుకావడం సులువు. ఒకరి ప్రయోజనాలను ఒకరికి ప్రతికూలమైనవని చెప్పి ద్వేషాలను రెచ్చగొట్టడం కులతత్వ, మతతత్వశక్తులకు సులభమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కారంచేడు, చుండూరువంటి సంఘటనలు తెలంగాణలో లేవని ఘనంగా చెప్పుకునేవారు. కానీ స్వయం పాలిత తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితికి భిన్నంగా లేదని, మంథని మధుకర్‌ హత్య, ఈ మధ్య కాలంలో పెరిగిపోయిన పరువుహత్యలు గ్రామీణ వైరుధ్యాలకు సూచికలు. స్థావరాలు మార్చుకుని అహంకరి స్తున్న భూస్వామ్య విధానానికి గుర్తులుగా మిగిలిపోతున్నాయి. సామాజిక ఉద్యమాల ద్వారానే, అభివద్ధిని కోరే వర్గాల పోరాటాలకు సామాజిక కోణాన్ని జోడించడం ద్వారానే పరిష్కారం అయ్యే జాడ్యాలు ఇవి. ఇటువంటి అమానవీయమైన హత్యలు కడుపులో ఉడుకుతున్న నిప్పును చూడడానికి నిరాకరించినట్టే అవుతుంది.
దళిత, బహుజనులకు సామాజికంగా, ఆర్థికంగా కొన్ని రాయితీలు కల్పించడం ద్వారా సంతృప్తి పొందుతున్నారు. కానీ అంతిమ లక్ష్యం 'రాజ్యాధికారం' చేజిక్కించుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. అందుకు ఉద్యమాల నాయకులు చొరవ, ప్రయత్న లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. కార్మికులను ఐక్యం చేసిన మేడే స్ఫూర్తితో సామాజిక శక్తులు ఐక్యమై రాజ్యాధికార సాధకకు ముందుకు కదలని ఆకాంక్షిస్తూ....

Sunday, May 14, 2017

మనుస్మృతికి బలైన మంథని మధుకర్‌ - Dalithashakthi Monthly Magazine



అదొక మారుమూల గ్రామం, కరీంనగర్‌ జిల్లాకి కూడా దూరమే, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, ఖానాపూర్‌ . దళిత యువకుడు మంథని మధుకర్‌ చేసిన ఒకే ఒక్క నేరం దగ్గరలో ఉన్న వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక మున్నూరుకాపు యువతిని ప్రేమించడం. ఆ యువతీ ఎమ్మెల్యే పుట్ట మధు బంధువు కావడం ఒక మనువాద సంస్కతికి, శిక్షకి చిహ్నంగా మధుకర్‌ శరీరం అందరిని గాయ పరిచింది. పాపం మధుకర్‌ ఎన్ని చిత్ర హింసలు పడ్డాడో? ఇక్కడ ఒక చట్టం ఉంటుంది అది ఎప్పటికి దళితుల దరి చేరదు, ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది దళిత వ్యతిరేకం , ఇక్కడ పోలీసులు ఉంటారు ఎప్పుడు దళితులని చంపడంలో ముందే, ఇక్కడ మీడియా ఉంటుంది అది డబ్బుకి అమ్ముడు పోతుంది, ప్రజల గొంతుక స్థితి ఎన్నడో దాటిపోయింది. మానవ హక్కుల వాదులు కులం అనే సరికి గొంతులో వెలక్కాయ పడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ కాస్ట్‌ని బట్టి వద్దామా? వద్దా? అని ఆలోచిస్తారు. ఏమైంది ఇప్పుడు, అమ్మాయి ద్వారా శవం దొరికింది, పోలీసులు ఎవరిని అరెస్ట్‌ చేయలేదు, కొన్ని దళిత సంఘాలు ధర్నాలు చేయడంతో వార్త సామాజిక మాధ్యమంలో వచ్చింది. అదే అందరిని కదిలించింది. వందలాదిగా తరలి వచ్చిన ప్రజలు, మానవ , పౌర హక్కుల కార్యకర్తలు , స్టూడెంట్స్‌ , లాయర్లు, పార్టీలు , ఒక్కటేమిటి ప్రపంచం అంతా అక్కడ కనిపించింది. కొందరు ప్రగతిశీలురులు, తాము ఉన్న చోటు కదలకుండా ధర్నాలతోని న్యాయం జరగదని రాస్తున్నారు. శిక్షించడమే ఆయుధం అంటున్నారు కానీ యుద్ధ భూమిలో దిగితే కదా లోతు తెలిసేది . కారంచేడులో తుపాకీతో మార్పులు కనిపించిన ఉధతమైన ప్రజా ఉద్యమం దేశ వ్యాప్తంగా కదిలించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చేటట్టు చేసిందని మరవొద్దు. అంటరాని ఉద్యమాలలో ప్రతి ఒక్క చర్య ముఖ్యమే, చిన్న రాత కావొచ్చు, పెద్ద ఎత్తున జన సమీకరణ కావొచ్చు అన్ని బలాన్ని ఇచ్చేవే కానీ బలహీన పరిచేవి కావు. అయినా ప్రభుత్వం అంగాలన్నీ కులవ్యతిరేకం అయినప్పుడు మనం చేసేది ఉదతమైన ఉద్యమమే.

మనుస్మృతికి బలైన మంథని మధుకర్‌ - Dalithashakthi Monthly Magazine



అదొక మారుమూల గ్రామం, కరీంనగర్‌ జిల్లాకి కూడా దూరమే, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, ఖానాపూర్‌ . దళిత యువకుడు మంథని మధుకర్‌ చేసిన ఒకే ఒక్క నేరం దగ్గరలో ఉన్న వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక మున్నూరుకాపు యువతిని ప్రేమించడం. ఆ యువతీ ఎమ్మెల్యే పుట్ట మధు బంధువు కావడం ఒక మనువాద సంస్కతికి, శిక్షకి చిహ్నంగా మధుకర్‌ శరీరం అందరిని గాయ పరిచింది. పాపం మధుకర్‌ ఎన్ని చిత్ర హింసలు పడ్డాడో? ఇక్కడ ఒక చట్టం ఉంటుంది అది ఎప్పటికి దళితుల దరి చేరదు, ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది దళిత వ్యతిరేకం , ఇక్కడ పోలీసులు ఉంటారు ఎప్పుడు దళితులని చంపడంలో ముందే, ఇక్కడ మీడియా ఉంటుంది అది డబ్బుకి అమ్ముడు పోతుంది, ప్రజల గొంతుక స్థితి ఎన్నడో దాటిపోయింది. మానవ హక్కుల వాదులు కులం అనే సరికి గొంతులో వెలక్కాయ పడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు వాళ్ళ కాస్ట్‌ని బట్టి వద్దామా? వద్దా? అని ఆలోచిస్తారు. ఏమైంది ఇప్పుడు, అమ్మాయి ద్వారా శవం దొరికింది, పోలీసులు ఎవరిని అరెస్ట్‌ చేయలేదు, కొన్ని దళిత సంఘాలు ధర్నాలు చేయడంతో వార్త సామాజిక మాధ్యమంలో వచ్చింది. అదే అందరిని కదిలించింది. వందలాదిగా తరలి వచ్చిన ప్రజలు, మానవ , పౌర హక్కుల కార్యకర్తలు , స్టూడెంట్స్‌ , లాయర్లు, పార్టీలు , ఒక్కటేమిటి ప్రపంచం అంతా అక్కడ కనిపించింది. కొందరు ప్రగతిశీలురులు, తాము ఉన్న చోటు కదలకుండా ధర్నాలతోని న్యాయం జరగదని రాస్తున్నారు. శిక్షించడమే ఆయుధం అంటున్నారు కానీ యుద్ధ భూమిలో దిగితే కదా లోతు తెలిసేది . కారంచేడులో తుపాకీతో మార్పులు కనిపించిన ఉధతమైన ప్రజా ఉద్యమం దేశ వ్యాప్తంగా కదిలించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చేటట్టు చేసిందని మరవొద్దు. అంటరాని ఉద్యమాలలో ప్రతి ఒక్క చర్య ముఖ్యమే, చిన్న రాత కావొచ్చు, పెద్ద ఎత్తున జన సమీకరణ కావొచ్చు అన్ని బలాన్ని ఇచ్చేవే కానీ బలహీన పరిచేవి కావు. అయినా ప్రభుత్వం అంగాలన్నీ కులవ్యతిరేకం అయినప్పుడు మనం చేసేది ఉదతమైన ఉద్యమమే.

Dalithashakthi - 2025 - Magazines