సంపాదకీయం
దేశంలోని ప్రతి పౌరుడు కుల, మతాలకు, ప్రాంతాలకు, భాష, లింగ బేధాలు లేకుండా భారతరాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుంది. ఆ హక్కు రాజ్యాంగానికి లోబడి భారత దేశ సౌర్వభౌమాధికారాన్ని గానీ, భారతదేశ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా గానీ, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా గానీ ఉండకూడదు. కానీ కన్నయ్య ప్రసంగంలో అలాంటివి ఏమి లేవని రుజువైంది. రాజ్యాంగానికి లోబడి మాత్రమే కన్నయ్య ప్రసంగం చేశారు కానీ రాజ్యాంగానికి అతీతంగా ఎప్పుడు కుడా మాట్లడలేదు. రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను పార్లమెంట్లో చర్య లేవనెత్తకుండా, కులవివక్షపై చర్చ జరగకుండా కన్నయ్యను దేశద్రోహాం కేసుపెట్టి దేశం మొత్తాన్ని ప్రక్కదారి పట్టించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. దేశద్రోహులు, దేశభక్తులెవరు? అనే అంశాన్ని ముందుకు తెచ్చింది.
రాజ్యసభలో మాయవతి కులవివక్ష అంశాన్ని, రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలను లెవనెత్తిన చర్చతో దేశవ్యాప్తంగా మరోసారి కులవివక్షపై చర్చ జరిగింది. పార్లమెంట్లో చర్చ చేసిన రోహిత్ కుటుంబానికి న్యాయం మాత్రం చేయలేకపోయారు. దేశద్రోహాం కేసులో యూనివర్సిటీ క్యాంపస్లోకి పోలీసులు చొరబడి కన్నయ్యకుమార్ను అరెస్టు చేసినట్లు రోహిత్ ఆత్యహత్యకు కారణమైన నిందితులు అగ్రకులాల వారు కాబట్టే ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. మనువాదులు భారత రాజ్యాంగం, చట్టాలకు లోబడి కాకుండా నిందితులే జడ్జీలై తమకు తమే తీర్పు ఇస్తున్నారు. ఈ తీర్పులు ధిక్కారిస్తున్న వారికి ఊరితాడులు ఎదురోస్తున్నాయి. రోహిత్ వేముల తన చివరి లేఖలో ''మనిషి విలువ పతనమైపోయింది. ఒక ఓటుకు, ఒక సంఖ్యకు, ఒక వస్తువుకు మనిషి విలువ పడిపోయింది. మనిషిని ఎప్పుడూ ఒక మెదడు ఉన్న వ్యక్తిగా గుర్తించడం లేదు. ప్రతి రంగంలో, చదువుల్లో, సమాజంలో, రాజకీయీల్లో, పుట్టుకలో, మరణంలో ఎక్కడా కూడా మనిషికి విలువ లేదు'' అన్నట్లు దళితులు, పేదలను సమాజం నుండి వేరు చేశారు, చేస్తూనే ఉన్నారు. అధికారం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం పతనానికి నాంది కాబోతున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్యూ విద్యార్థుల పోరాటాలు దళిత, బడుగు, బలహీన వర్గాలు మేల్కొకొలుపు కావాలనీ ఆశీస్తూ...మీ...
డాక్టర్ గాలి వినోద్ కుమార్
గౌరవ సంపాదకులు

No comments:
Post a Comment