
బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందించేందుకు నిరంతరం తాపత్రయపడేవారే మన నాయకుడైతే, 'పే బ్యాక్ సోసైటి' సిద్దాంతాన్ని, టీమ్ స్పీరిట్తో పని చేసే సర్వయ్యలాంటి నాయకులు ప్రాంతం పట్ల, ప్రజల పట్ల అవగాహాన కలిగి ఉండటం మనకు అదనపు అర్హతలు. గత ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పని చేసిన అనుభవంతో పేదలు, దళితులు ఎక్కువగా ఉన్న అంబర్పేట ప్రాంతంతో ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి తన వంతుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతోపాటు వివిధ వర్గాల ప్రజల ద్వారా 20 కోట్ల సమీకరించి ''కార్ఫస్ ఫండ్'' ఏర్పాటు చేయనున్నారు. అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను తయారుచేసేందుకు వివిధ వర్గాల ప్రజలతో మానిటరింగ్ కమిటిని నియమించుకుని బస్తీలు, కాలనీలకు కావాల్సిన మౌళిక వసతులు, విద్య, వైద్యం, తదితర సామాజిక అవసరాలకు తీర్చే విధంగా ఈ కమిటి పని చేయనున్నట్లు ప్రకటించారు. చదువుకున్న విద్యార్థులు, సివిల్ సర్వీస్, గ్రూప్స్ కోచింగ్, సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనుకున్న వారికి స్కిల్స్ డెవలప్మెంట్కు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ''తన జాతి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందలంటే రాజ్యాధికారం వచ్చినప్పుడే సాధ్య''మని బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ అన్నారు. అలాంటి నాయకున్నే మన నేతగా ఎన్నుకుంటే మనం విజయం సాధించినట్లే...
- Published on 01 October 2018.
- If you want copies contact number 9440154273,
- dalithashakthi@gmail.com
No comments:
Post a Comment