Sunday, June 25, 2023

ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధి

ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధి

 

దేశంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పాలకపార్టీలు కృత్రిమంగా ఎన్నికల వాతావరాణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలకు ఉన్న సమస్యలు పక్కా దారి పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో ఇరవై రోజులపాటు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను సైతం సొంత పార్టీ కార్యక్రమంగా మార్చుకున్నది. దశాబ్ధి ఉత్సవాలు ఆయావర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరిగింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించలేకపోతున్నది. రైతుల ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయలేక, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్‌ మిల్లర్ల దోపిడిని కట్టడి చేయలేక, రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది.

నిధుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ధనిక రాష్ట్రం పేరుతో ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాలయాలను వేతనాలు అందుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల వేతనాలు చెల్లించడంలో విఫలం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రతినెల రుణాలు తీసుకోకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో కూడా నిధులు దుబారా ఖర్చు చేస్తున్న విషయం కాగ్‌ నివేదికలో పేర్కొనడం మనం గమనించాలి. వివిధ అభివృద్ధి పనులు చేసినబిల్లులు చెల్లించలేక సర్పంచ్‌ మొదలుకుని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదు.
నియమాకాలు... ''ఊరందరిదీ ఓ దారైతే... ఉలిపి కట్టెది మరోదారి...'' అన్నట్టు ఉన్నది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కాంట్రాక్టు నియమాకాలు రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటలు నీటిమీద రాతలు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ఖాళీలు ఉన్న, ఒక్క ఉద్యోగి రెండు, మూడు రకాల పనులు చేస్తున్నారు. ఇది మన పాలకులకు తెలియంది కాదు. కానీ అన్ని ఖాళీలు భర్తీ చేసినట్లు గ్లోబల్‌ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ప్రకటించిన నియమాకాలు సైతం భర్తీ చేయలేకపోతుంది. ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులు/ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటుంది.
తన అధికారాన్ని ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, మేధావులను, ప్రజా సంఘాల నాయకులను, ముఖ్యంగా జర్నలిస్టులను దేశద్రోహులుగా ముద్రవేస్తూ నల్లచట్టాల కింద అణచివేయాలని చూస్తుంది. ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అవినీతి, భూ కబ్జాలపై ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, జర్నలిస్టులను బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో నిత్యం జర్నలిస్టును, మేధావులను బూతు పురాణంతో తిడుతూ... తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్న మూకలను ప్రభుత్వం నియంత్రించలేక పోతున్నది. వారికే వత్తాసు పలుకుతుండటం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది.
- బి గంగాధర్‌, ఎడిటర్‌ప్రణాళికాలు లేని... దేశాభివృద్ధిదేశంలో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పాలకపార్టీలు కృత్రిమంగా ఎన్నికల వాతావరాణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలకు ఉన్న సమస్యలు పక్కా దారి పట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో ఇరవై రోజులపాటు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను సైతం సొంత పార్టీ కార్యక్రమంగా మార్చుకున్నది. దశాబ్ధి ఉత్సవాలు ఆయావర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. నీళ్లు, నిధులు, నియమకాల పేరుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరిగింది. లక్షల కోట్లు ఖర్చు చేసిన రైతులకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించలేకపోతున్నది. రైతుల ఆరు నెలలు కష్టపడి పండించిన పంట కొనుగోలు చేయలేక, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్న రైస్‌ మిల్లర్ల దోపిడిని కట్టడి చేయలేక, రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసినట్లు ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది.

నిధుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ధనిక రాష్ట్రం పేరుతో ప్రజాప్రతినిధులు లక్షలాది రూపాలయాలను వేతనాలు అందుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల వేతనాలు చెల్లించడంలో విఫలం అవుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రతినెల రుణాలు తీసుకోకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో కూడా నిధులు దుబారా ఖర్చు చేస్తున్న విషయం కాగ్‌ నివేదికలో పేర్కొనడం మనం గమనించాలి. వివిధ అభివృద్ధి పనులు చేసినబిల్లులు చెల్లించలేక సర్పంచ్‌ మొదలుకుని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ప్రభుత్వాల్లో చలనం కనిపించడం లేదు.
నియమాకాలు... ''ఊరందరిదీ ఓ దారైతే... ఉలిపి కట్టెది మరోదారి...'' అన్నట్టు ఉన్నది తెలుగు రాష్ట్రాల పరిస్థితి. కాంట్రాక్టు నియమాకాలు రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాటలు నీటిమీద రాతలు అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో అనేక ఖాళీలు ఉన్న, ఒక్క ఉద్యోగి రెండు, మూడు రకాల పనులు చేస్తున్నారు. ఇది మన పాలకులకు తెలియంది కాదు. కానీ అన్ని ఖాళీలు భర్తీ చేసినట్లు గ్లోబల్‌ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ప్రకటించిన నియమాకాలు సైతం భర్తీ చేయలేకపోతుంది. ప్రైవేటు పరిశ్రమల్లో కార్మికులు/ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసినట్లు తన ఖాతాలో వేసుకుంటుంది.

తన అధికారాన్ని ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, మేధావులను, ప్రజా సంఘాల నాయకులను, ముఖ్యంగా జర్నలిస్టులను దేశద్రోహులుగా ముద్రవేస్తూ నల్లచట్టాల కింద అణచివేయాలని చూస్తుంది. ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అవినీతి, భూ కబ్జాలపై ప్రశ్నిస్తున్న కవులు, కళాకారులను, జర్నలిస్టులను బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో నిత్యం జర్నలిస్టును, మేధావులను బూతు పురాణంతో తిడుతూ... తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్న మూకలను ప్రభుత్వం నియంత్రించలేక పోతున్నది. వారికే వత్తాసు పలుకుతుండటం పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం వచ్చేసింది.

- బి గంగాధర్‌, ఎడిటర్‌

జర్నలిస్టులకు తప్పని తిప్పలు

జర్నలిస్టులకు తప్పని తిప్పలు


ఎందుకు నేను బీజేపీపైనే ఎక్కువ వీడియోలు చేస్తున్నాను? ముఖం చూపించలేని వాళ్లు, సొంత పేర్లు చెప్పుకోలేని ఫేక్ అకౌంట్స్ నుంచి ఘోరమైన కామెంట్స్, ఇన్ బాక్స్ మెసేజస్ వస్తున్నా నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? ఇండిపెండెంట్ జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఎక్కువ వీడియోలు బీజేపీని ప్రశ్నిస్తూ ఎందుకు చేస్తున్నాను? 

నేను చేసిన వీడియోలు మీరు చూశారా ఎంఐఎం బీజేపీ ఒక్కటే అని చాలా సార్లు చెప్పాను. బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తానో కూడా చెప్పాను. మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అంటేనే ప్రజల్ని సమానంగా చూడట్లేదు అని అర్థం. బీజేపీ=ఎంఐఎం రెండింటి డీఎన్ఏ ఒకటి. ఒకటి పెద్ద పార్టీ రెండోది తోకపార్టీ అంతే తేడా. 

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కంటే ఏ దేశానికీ అత్యంత ప్రమాదకరమైన విషయం మరొకటి ఉండదు. రాజ్యాంగం సాక్షిగా పాలిస్తామని చెప్పి ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి వచ్చినప్పట్నుంచి మెజారిటీ మతం వాళ్లను మైనారిటీ మతాలపైకి ఎగదోయడం కూడా విశాలమైన ఛాతీ ఉన్న రాజకీయాలేనా. వాజ్ పేయ్ ఇలా చెయ్యలేదే. మత మార్పిడులు జరగకుండా హిందూ మతంలో కులాన్ని పాతరెయ్యొచ్చు. మరి కుల నిర్మూలనకు తీసుకున్న చర్యలేంటి? గిరిజన రాష్ట్రపతి, బహుజన ప్రధాని ఉన్న దేశంలో మత రాజకీయాలు ఎందుకు? ఒక్క రాష్ట్రంలో అయినా మతం పేరు చెప్పకుండా ఎందుకు గెలవలేకపోతున్నారు..? 

అధికారంలో ఉన్నదే హిందూ పార్టీ యినప్పుడు.. 80 కోట్ల మంది హిందువుల్ని ఎవరు ఈ రోజు అభద్రతలోకి నెట్టేశారు? 75 ఏళ్లుగా లేని అభత్రత ఇప్పుడే వచ్చిందా. ఢిల్లీలో ఓ హిందు అమ్మాయిని ముస్లిం చంపేస్తే దాన్ని ఒక క్రైంగా చూడట్లేదు హిందువులపై దాడి అంటున్నారు. అదే హిందూ అమ్మాయిల్ని రోజూ వందల మందిని భర్తలూ, తండ్రులు, అన్నలూ, ప్రియుడు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తోంటే ఎందుకు మాట్లాడరు? దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు. అలాగని మీ స్నేహితున్నో, నా పక్కింట్లో ఉన్న సాధారణ ముస్లింలనో దోషులుగా చూపవచ్చా? ఇతర దేశాల్లో మనవాళ్లు ఉన్నారు, అక్కడొక హిందువులు క్రైం చేస్తే మొత్తం అందరినీ ఒకే గాటన కడితే మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏం జరిగినా మతం కోణం ఎందుకు వస్తోంది? చివరికి బాలాసోర్లో రైలు ప్రమాదం జరిగిదే పక్కన మసీదు వల్లే, ఆ రోజు శుక్రవారం కాబట్టి అనేది తెరపైకి వచ్చింది. తీరా చూస్తే అది మసీదు కాదు ఇస్కాన్ టెంపుల్. తర్వాత స్టేషన్ మాస్టర్ ముస్లిం కావడం వల్లే ప్రమాదం అన్నారు తీరా చూస్తే ఆ స్టేషన్ మాస్టర్ మహంతి ఒక హిందువు. తర్వాత ఇప్పుడు ఇంజినీర్ అమీర్ అన్నారు.. ఇది కూడా తప్పుడు ప్రచారమే అని చివరికి రైల్వే డిపార్టెంట్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఒక ప్రమాదాన్ని ఇన్ని సార్లు మతం కోణంలో చూసి తప్పుడు ప్రచారాలు చేసి నాలుకు కరుచుకుంటున్నారు అంటే ఎంత ద్వేషం నింపేసి ఉండాలి సామాన్యుల బుర్రల్లోకి. చిన్న పిల్లలు కూడా ఇవాళ మతం గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ పరిస్థితిలోకి ఎవరు నెట్టేశారు అంటే కారణం ఎవరు? మతాల పేరుతో కొట్టుకుచావనీనా భవిష్యత్తు తరాలు. ఇప్పటి ఈ విద్వేషం కాల్చేసేది మన పిల్లల్ని కాదా? సిరియా, ఆఫ్గనిస్థాన్ పాకిస్థాన్ ఈ దేశాల పక్కనా మనకు స్థానం కావాల్సింది? కుటుంబాల్లో, పిల్లల మనసుల్లో నాటుతున్న విష బీజాలు పెరిగి పెద్దయ్యాక ఎలాంటి ఫలితాలు ఇస్తాయో పాలకులు ఆలోచిస్తున్నారా? ఇప్పటి విద్వేషం రేపు ఎన్ని ఓట్లు తెస్తుంది అనే దగ్గరే వాళ్ల ఆలోచనలు ఆగిపోతున్నాయ్.. మర్నాడు మరో ఎన్నిక.. ఇంతే కదా నడుస్తోంది.. !?

ఇప్పుడు మనకు కావాల్సింది అమెరికాతో చైనాతో పోటీ పడే భారతదేశం కాదు... హిందూరాష్ట్రంగా ప్రకటించడమే మనక్కావాలి? పోనీ ఏమౌతుంది ప్రకటిస్తే.. ఏం మారుతుంది? విదేశాల్లో సెటిలైపోయిన ఒక్క నాయకుడి బిడ్డైనా తిరిగొచ్చేస్తుందా? ఒక్క సామాన్యుడి పరిస్థితి మారుతుందా..? మహా అయితే పుస్తకాల్లో సిలబస్ మారిపోతుంది. ఇంగ్లీష్ మినిమం అయ్యి హిందీ, సంస్కృతం వస్తుంది. అదే జరిగిదే చిన్న చిన్న చదువులకోసం కూడా విదేశాల బాట పట్టరా? అదా మనక్కావాల్సింది?  

రాను రాను మతాలు, కులాలు లేని భారతదేశాన్ని నిర్మించాలా లేదా కొకర్నొకరు ద్వేషిస్తూ కొట్టుకునే దేశం కావాలా? కేరళలో 32 వేల మంది అమ్మాయిలు ఐసిస్ లో చేరారా? మరి అన్ని మిస్సింగ్ కేసులు ఉండాలి కదా.. గుజరాత్ లో 40 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. తెలంగాణలో ఏపీలో అన్ని రాష్ట్రాల్లో వేలాది మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు వీళ్లంతా ఏమైపోతున్నట్లు? కేరళలో 3 కేసుల్లో ఇప్పటిదాకా కేసులు ఫైల్ అయ్యాయి, తల్లిదండ్రులు బయటికొచ్చారు, బాధితులు ఉన్నారు. మరి మిగతా  31వేల 997 కేసులు ఏవీ.. అంత మంది ఉగ్రవాద సంస్థల్లో చేరిపోతో ఎన్ని లక్షల మంది వాళ్ల తల్లిదండ్రులు, బంధువులు రోడ్లపైకి రావాలి.. వచ్చారా?  మరి ఎందుకీ ప్రచారం? ఆజాదీ కాశ్మీర్ సమస్య కాశ్మీర్లో ఉంది. కాశ్మీర్లో సాధారణ హిందువులు,సాధారణ ముస్లింలు కొట్టుకోవట్లేదు.. ఉగ్రవాదులు వేరు సాధారణ వ్యక్తులు వేరు. హిందువుల్లో క్రైస్తవుల్లో కూడా మతాన్ని అతిగా తీసుకొని ఇతరుల్ని ద్వేషించే వాళ్లు ఉంటారు. ఇది వ్యక్తుల సమస్య ఇక్కడికి రాజకీయం ఎందుకు తెస్తున్నారు.. సరే ఇదే బీజేపీ నార్త్ ఈస్ట్ లో క్రిస్టియన్ అనుకూల విధానాలు, హామీలు ప్రకటనలు చేసి గెలిచింది. అంటే ఎక్కడ ఏ మతం మెజారిటీ అయితే వాళ్లను పోలరైజ్ చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి రావడం ఇదేనా కావాల్సింది? 

మణిపూర్ ఆహుతి అయిపోతోంటే.. కనీసం ప్రధాని నుంచి శాంతి ప్రకటన కూడా ఎందుకు రావట్లేదు? కరోనా కష్టకాలంలో టీవీల్లో కనిపించి చెప్పిన మాట కనీసం మన్ కీ బాత్ లో అయినా చెప్పొచ్చు కదా.. నేనున్నాను.. మీ సమస్య పరిష్కరిస్తాను అని.. ఎందుకు చెప్పట్లేదు? చనిపోతున్న వాళ్లంతా మతం మారిన క్రైస్తవులే కాదు.. హిందువులూ చనిపోతున్నారు.. హిందువులైన మెయిటీల ఆస్తులూ ధ్వంసమౌతున్నాయ్.. మరి హిందువు కోణంలో అయినా ఒక ప్రకటన చెయ్యాలి కదా కేంద్రం. పోనీ గిరిజన మహిళ అయిన రాష్ట్రపతితో అయిన ప్రకటింపజేయవచ్చు కదా.. ఇవేవీ ఎందుకు జరగట్లేదు. నేను ఇది అడిగినా మీ దృష్టిలో దేశద్రోహి, హిందూ వ్యతిరేకి అయిపోతున్నాను. చేవ చచ్చిన కాంగ్రెస్ పార్టీని ఏమని అడుగుతాం ఈ దేశం గురించి..? అధికారంలో ఉన్న వాళ్లనే కదా అడగాలి..? 

పోనీ దేశంలో ఉన్న మెజారిటీ మతానికి ఏం మేలు చేసినట్లు? ఏ సామాన్యుడినైనా పిలిచి మతం చూసి ఓటు వేశావు కదా.. నీకు జరిగిన 3 గొప్ప మేళ్లు చెప్పు అంటే ఏం చెప్తాడు?పెట్రోల్ గ్యాస్ ధరలే కాదు.. టాక్స్ పరిధిలోకి రాని వస్తువులు ఎన్ని ఉన్నాయ్ ఇప్పుడు?రైళ్లలో సామాన్యులు కిక్కిరిసి కూర్చునే జనరల్ బోగీలను నిలువునా కోసేస్తున్నారు.. వృద్ధులకుండే రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేశారు. 

పెన్షన్ల నుంచి కూడా రకరకాల కోతలతో నేరుగా వసూళ్లు చేస్తున్నారు. పరిశ్రమలు పెట్టక్కర్లేదు.. ఉన్న వాటిని సొంత ఆస్తిలా అమ్మేస్తున్నా అడగకూడదా? కనీసం ఒక పౌరురాలిగా అయినా అడిగే హక్కు ఉంటుంది కదా.. మీరు అడగరు.. నేను అడిగితే హిందూ వ్యతిరేకినా? బీజేపీని అధికారంలోకి తెచ్చింది గుజరాత్ మోడల్ చూసేగానీ మతాన్ని చూసి కాదు. మతం పేరుతోనే అయితే అద్వానీని చూపించే వాళ్లు 2014లో. గుజరాత్ వెలిగిపోతోంది.. భారత్ కూడా వెలిగిపోవాలి అంటే మోదీ రావాలి అని.. 

మోదీ వచ్చారు నల్లధనం వచ్చిందా, నోట్ల రద్దు తర్వాత గుర్తించిన నల్లధనం ఏమీ లేదు.. ఏదైనా చేశారు అంటే మళ్లీ రెండు వేల నోట్లు రద్దు చెయ్యడం.  మరి అకౌంట్లలో వేస్తాం అన్న రూ. 15 లక్షల మాటేంటి? ఇది ఎవరూ అడగకూడదు కదా..? అడిగితే దేశ ద్రోహి, ధర్మ ద్రోహి హిందూ వ్యతిరేకి.  జీఎస్టీ వల్ల కేంద్రానికి రెవెన్యూ పెరిగింది. కానీ పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న చిన్న వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లాయి. చిన్న హోటల్లో ఇడ్లీ తిన్నా జీఎస్టీ వేస్తున్నారు.. 

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం అన్నారు..ఏవీ ప్రతి ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ్.. మన దేశంలో ఉండే సహజమైన అధిక జనాభా అనే పొటెన్షియాలిటీని బేస్ చేసుకొని, మనం చదువులకు ఇస్తున్న ప్రాముఖ్యతను క్యాష్ చేసుకునేందుకు చీప్ లేబర్ కోసం ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ప్రైవేట్ జాబ్స్ పెరిగాయ్.. మరి ప్రభుత్వ ఉద్యోగాలేవీ..? మేము నిరుద్యోగులం అని 29 కోట్ల మంది ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకున్నారు..? నమోదు చేసుకోని వాళ్లనూ కలిపితే..? 

కొంత మంది పారిశ్రామిక వేత్తల్నే ప్రోత్సహించడం వల్ల మార్కెట్లో మొనో పొలి పెరిగిపోయింది. ఇప్పుడు దేశం అంత భారీ స్థాయికి చేరుకున్న ఆ ఒకరిద్దురు పారిశ్రామిక వేత్తలకు ఏదైనా అయితే దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే స్థితికి ఎవరు కారణం? గ్యాస్, పెట్రోల్ ధరల ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడింది. గ్రామాల్లో మళ్లీ కట్టెపొయ్యలు ఎందుకు పెరిగాయో మీరు ఊరెళ్లినప్పుడు అడగండి ఆడవాళ్లు చెప్తారు. మీ ఫోన్ చెక్ చేసుకోండి మీకు బీజేపీ ఐటీ సెల్ నుంచి వండి వార్చిన మెసేజీలు మోడీ వల్ల దేశం వెలిగిపోతోంది అన్న మెసేజీలు, ఇతర మతాలపై ద్వేషం కలిగించే మెసేజీలు ఎన్ని వచ్చాయో చూసుకోండి. 

కొత్తగా ఆఫీసులో చేరిన వాళ్లు ఇప్పుడు వాళ్ల క్వాలిఫికేషన్స్ గురించి చూడట్లేదు, పక్కవాడి ఐడియాలజీ ఏంటి, వాడి మతం ఏంటి అని చూస్తున్నారు. క్రిస్టియనో, ముస్లిమో అయితే కొందరు హిందువులు ద్వేషిస్తున్నారు. నుదుటున కుంకం బొట్టుపెట్టుకున్న ఫ్రెండును చూస్తే ముస్లిం లేదా క్రిస్టియన్ ఉలిక్కిపడుతున్నారు. మన ఫ్రెండ్స్ లో ఆ అభద్రతకు కారణం ఎవరు? అంత అవసరం ఏంటి? పోనీ ఆలయాలకు ఏం చేశారు? అయోధ్యలోని రామమందిరమే కాదు అంతే విశిష్ఠత ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం ఉంది, భద్రాద్రి రాముల వారి ఆలయం ఉంది.. వాటికి ఏం చేశారు? ఏమీ లేదు.. ఒక్క టెంపుల్ చూపించి దేశంలోని మొత్తం దేవాలయాలను నిర్వీర్యం చేస్తున్నది ఎవరు? ఈ రోజు అందరికంటే దయనీయ పరిస్థితి సగటు సామాన్య హిందువులది, గతంలో ప్రభుత్వాలపై కోపమొస్తే గట్టిగా రోడ్లపైకి వచ్చి నిలదీసే వాళ్లు. కానీ ఇప్పుడు ఎవరైనా కడుపుకాలి నోరెత్తితే.. హిందువై ఉండి హిందువుల్ని ప్రశ్నిస్తావా నువ్వు దేశద్రోహివీ, హిందూ ద్రోహివీ.. నీ మొగుడు/పెళ్లాం ముస్లిమా, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియనా అంటున్నారు..

సామాన్య యువత(బడా బాబుల పిల్లలు కాదు) మెదళ్లు ఈ రోజు గొప్ప భవిష్యత్తు గురించో, శాస్త్రీయ దృక్పథం వైపో లేవు.. కేవలం తాము నమ్మిన మతాన్ని తమను రెచ్చగొడుతున్న మతాన్ని డిఫెండ్ చేసే స్థాయికి పడిపోయాయి.. ఇన్ని కోట్ల మెదళ్లు మతం చుట్టూ ఉన్నప్పుడు... నా లాంటి ఒక్కరో ఇద్దరో ఇలా చేస్తున్న మతోన్మాద పార్టీలను ప్రశ్నిస్తే మీకు చాలా కష్టం కలుగుతోంది. నాకు తెలుసు నాది ప్రమాదకరమైన ప్రయాణం.. ఎప్పుడో ఏ అమాయక యువకుడో నా మీద తను ప్రేమించే పార్టీ నింపిన విద్వేషాన్ని కత్తిగానో బుల్లెట్టుగానో మార్చి దాడి చేస్తాడని.. అలాగని కోట్లాది మంది యువత కళ్లముందు మతం మత్తులోకి జారుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉండలేకనే నా పరిధిలో నేను చెప్పాల్సినవి చెప్తున్నాను. మత విద్వేషాలు మాత్రమే ఏ దేశయువతకైనా అత్యంత ప్రమాదకరం అని నేను చెప్తున్నందుకు నన్ను ద్వేషిస్తున్నారు, బూతులు తిడుతున్నారు.. నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కానివ్వండి.. నన్ను డిఫెండ్ చె్యయడానికి ఏ పార్టీ ముందుకు రాదు నేను ఏ పార్టీ మద్దతుదారూ కాదు కాబట్టి.. ఏ కుల సంఘమూ రాదు.. నా కులమేంటో ఎవరికీ తెలీదు కాబట్టి.. ఏ గ్రూపూ నా కోసం నిలబడదు.. నాకు ప్రభుత్వం ఇచ్చే జర్నలిస్టు గుర్తింపు కార్డు సహా ఏ గుర్తింపూ లేదు కాబట్టి.. 

ఇలా ఒకరిద్దరికి నాకు తోచినప్పుడు వివరణ ఇవ్వడం కంటే ఇంకేమీ చెయ్యలేని అశక్తురాలిని.. ఏదో ఒక రోజు రాలిపోతాను, బలైపోతాను.. కానివ్వండి.. అలా అయ్యేలోపు కనీసం నా ఆవేదనను, ఏకాకిగొంతును రికార్డు చెయ్యనివ్వండి.  

- తులసి చందు,

Sunday, June 11, 2023

స్వాముల పేరుతో మోసాలు

 హైదరాబాదులో గత నాలుగు రోజులుగా వస్తున్న ప్రధాన వార్తలు స్వాములు వారి కార్యకలాపాలు. అమాయకులైనటువంటి ప్రజలను ముఖ్యంగా మహిళలను భక్తి పేరుతో చేస్తున్నటువంటి దారుణాలు మోసాలు చూస్తూనే ఉన్నాం. 200 ఎకరాల్లో దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా హైదరాబాద్ కు కూత వేటు దూరంలో ఉన్న ముచ్చింతల్లో పంచలోహాలతో 216 అడుగుల ఎత్తులో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు  మంత్రులతో పాటు అనేకమంది పారిశ్రామిక సినీ రంగ ప్రముఖులు ఆ విగ్రహాన్ని సందర్శించారు.

రాష్ట్రంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమాన్ని  వివిధ వర్గాల ప్రజలు పారిశ్రామిక విధులు విరాళాలతో నిర్మించారు. అలాంటి ఆశ్రమాన్ని ట్రస్టు ద్వారానో స్వతంత్రంగా ఆలోచించేటటువంటి వ్యక్తుల సమూహం ద్వారా పర్యవేక్షణ చేయాల్సి ఉండగా చిన్ని చిన్న జీయర్ స్వామి బంధు ప్రీతితో తన సొంతమైన అల్లుడుని నిర్వాకుడిగా ప్రకటించుకున్నారు. ఈ ఆశ్రమంలో జరుగుతున్నటువంటి లీలలను ఆయనకు తెలియకుండా జరుగుతున్నావని భావించిన అక్కర్లేదు. ఎందుకంటే ఆశ్రమంలో అన్నీ తానై చూసుకుంటున్నటువంటి వ్యక్తి ఇలాంటి వాడు ఏ విధంగా సరిపోతాడు అని సరి చూసుకున్న తర్వాతనే బాధ్యతలు అప్పగించి ఉంటారు. 

ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలను ఆశ్రమ నిర్వాకులు గాని చిన్న జీయర్ స్వామి గారి ఇప్పటివరకు ఖండించలేదు. జరిగిన జరుగుతున్న వాస్తవాలను ఆంధ్రజ్యోతి నిర్భయంగా వెల్లడించింది.

భక్తి పేరుతో దేవుని గుడికి వస్తున్నటువంటి అప్సర అనే యువతని అక్కడున్నటువంటి పూజారి భక్తి ముసుగులో కామంతో కండ్లు మూసుకుపోయి (వివాహితుడైన వ్యక్తి) ప్రేమ పేరుతో వలవేసి గర్భవతిని చేయడంతో పాటు హత్య చేసి మ్యాన్ హోల్ (మురికి కాలువలో) శవాన్ని పడి వేయడం అంటే రాష్ట్రంలో స్వాముల వికృత చేష్టలకు ఈ దారుణాలు ప్రతిరూపం.

ఇప్పటికైనా.. భక్తి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నటువంటి స్వాములు, బాబాలు, పూజారులు, తదితర మోసగాళ్లపట్ల జాగ్రత్త మెలిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- బి గంగాధర్, ఎడిటర్, దళితశక్తి మాసపత్రిక

Thursday, June 1, 2023

దళితశక్తి జాతీయ తెలుగు మాసపత్రిక జూన్‌ 2023 సంచిక

 దళితశక్తి మానపత్రిక తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ, అభిమానం సంపాదించుకుని అత్యధిక సర్క్యులేషన్‌ కలిగి ఉన్నది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, జ్యోతిరావ్‌ ఫూలే, మాన్యశ్రీ కాన్షీరాంల ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నిరంతరం కషి చేస్తున్నది. ఇప్పటి వరకు అనేక పత్రికలు వచ్చాయి, పోయాయి. ఎందుకంటే ఆర్ధిక వనరులు లేక ఆ పత్రికలు నిలబడలేకపోయాయి. ఈ పోటీ ప్రపంచంలో ప్రింట్‌ మీడియా రంగంలో ఉన్నటువంటి పత్రికలకు మీ వంతు సహాయ, సహకారాన్ని చందాలు, ప్రకటనలు, విరాళాల రూపంలో అందించి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము. మన పత్రికలను మన వారే ప్రోత్సహించకపోతే ఇతరులెవరూ కొంటారు? ఇతరులెవరూ ప్రోత్సహిస్తారు? మన ప్రయోజనాల కోసం నిబద్ధతతో నడిచే పత్రికకు దళిత, బహుజన ప్రజలు, ఉద్యోగులు, నాయకులు చందాలు, ప్రకటనలు, విరాళాలు అందించి ముందుకు నడిపిస్తారని, నడిపించాలని దళితశక్తి మాసపత్రిక విజ్ఞప్తి చేస్తున్నది.





Dalithashakthi - 2025 - Magazines