Wednesday, August 2, 2023

ఆగష్టు 15 & జనవరి 26 తేడా ఏమిటో తెలుసా?

ఆగష్టు 15 & జనవరి 26 తేడా ఏమిటో తెలుసా? 


ఆగస్టు 15, 1947న స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపు కుంటున్నాం. దేశ వ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజు. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపు కుంటాం. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించు కుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగర వేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ ముఖ్యమైన తేడా ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆగస్ట్‌ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్‌ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.

మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్‌ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియ జేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెప లాడిస్తారు. ఇక్కడ జనవరి 26 నాడు జెండాను అప్పటికే కర్ర/పోల్‌కి పైన కట్టి ఉంచుతాము. కనుక ఆగస్ట్‌ 15లాగా జెండాను కింది నుండి పైకి లాగడం అనేది జరగదని గమనించాలి.

దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగుర వేయడానికి గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒకకారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్‌ డే నాడు మహౌన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్‌ 15 సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగుర వేస్తారు (ఖీశ్రీaస్త్ర నశీఱర్‌ఱఅస్త్ర). గణతంత్ర దినోత్సవంనాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు (ఖీశ్రీaస్త్ర ఖఅటబతీశ్రీఱఅస్త్ర). ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే... స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. రెండింటిలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫోటో పెట్టాలి. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్‌ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26న రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగు తుంది. ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని ఖచ్చితంగా జెండా వద్ద పెట్టాలి. ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు. (చదువు కున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు). కావున ఈ సమాచారాన్ని దేశపౌరులకు అందించాలని, మన వాళ్లకి అవగాహాన కల్పించడంకోసం అందించడం జరిగింది. ముఖ్యంగా భావిభారత పౌరులైన విద్యార్థులకు అందించాల్సిన అవసరంఎంతైన ఉంది. 

- బి స్వాతి, మేనేజర్‌

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines