Wednesday, August 2, 2023

అన్నింటా... మహిళకే అవరోధం?

అన్నింటా... మహిళకే అవరోధం?

స్వాతంత్య్ర వచ్చి 76 సంవత్సరాలు గడిచిన దేశ జనాభా సగభాగంగా వున్న మహిళలను నేటికి పురుషులతో సమానంగా చూడలేకపోతున్నారు. భారతదేశం పారిశ్రమిక రంగంతోపాటు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటి పడుతున్నది. అయినా దేశంలో అన్ని ప్రాంతాలను, వివిధ వర్గాల ప్రజలను ముఖ్యంగా మహిళలను సమానంగా చూడలేకపోతున్నది. దీనికి కారణం పాలకులా? ప్రభుత్వ యంత్రాంగమా? మనది పితృస్వామ్య సమాజం, అందుకే పురుషులకు అన్ని విధాల పరిస్థితులు అనుకూలంగా తయారు చేయబడ్డాయని చెబుతారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మహిళలు అనేక రంగాల్లో తమ సత్తా చాటుకుంటునే ఉన్నారు. అయినా వారిని బలహీనులుగా చూస్తున్నారు. పురుషుడు చేస్తున్న అన్ని పనులను సైతం మహిళలు సునయాసంగా చేస్తున్న పరిస్థితిని గమనిస్తున్నాం, పాలకులకు మాత్రం వారి సేవలు కనిపించడం లేదు. విద్యా, ఉద్యోగం, ఉపాధి రంగాల తోపాటు రాజకీయంగా దేశ ప్రథమ పౌరురాలు నుండి కింది స్థాయిలో పనిచేసే వరకు అన్ని రంగాల్లో, మహిళలు ఉన్న వివక్ష మాత్రం తప్పడం లేదు. సామాజిక, సేవ రంగాల్లో మహిళల కృషి దేశం ఎన్నటి మార్చిపోలేదు. పారిశ్రామికం గా అనేక మంది మహిళలు రాణిస్తున్నారు. రాజకీయ రంగంలో అవకాశం దొరికిన ప్రతిసారి తనను తాను నిరూపించుకుంటున్నది. కానీ అవకాశాలే లేకుండా చేస్తున్న రంగం ఎదైనా ఉందంటే రాజకీయ రంగం మాత్రమే. అన్నింటికీ మహిళనే హస్త్రంగా ఉపయోగిస్తున్నారు. మణిఫూర్‌లో మహిళలను ఊరేగించడం అయా సామాజిక వర్గం ప్రజలను బయటికీ రాకుండా, భయపెట్టడానికే చేశారని బహిరంగంగానే ప్రకటించారు.

సంక్షేమ పథకాలు అంటే నిరుపేదలైన వారికి అందించేందుకు రాజ్యాంగం ప్రత్యేక ఆధికరణలను ఏర్పాటు చేసంది. ఎస్సీ, ఎస్టీలు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు రాజకీయ పార్టీలు పెద్దఎత్తున్న సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. దీంతో పేద ప్రజల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది కనుక వారిలో అసంతప్తి ప్రబలితే తమకు మొదటికే మోసం వస్తుందేమోనని ఉపశమన పరిచేందుకు తెచ్చినవే సరికొత్త సంక్షేమ పధకాలు. అధికారం కోసం ఒక పార్టీ కంటే మరొక పార్టీ ఎక్కువ ఇస్తానని చెప్పి ఓట్లను కొల్లగొట్టడం తప్ప సంక్షేమ పధకాలను ఎత్తివేసే పరిస్థితి లేదు, అలాగే పూర్తిస్థాయి వాటిని అమలు చేసిన దాఖాలాలు లేవని చెప్పాలి.
స్వయం నిర్ణయాధికారం కల్పించేందుకు విద్యా, ఉద్యోగం, ఉపాధి అందించేందుకు రాజకీయ పార్టీలు ముందుకు రాకుండా సంక్షేమ పథకాలతోనే ప్రజలను భ్రమలో ముంచుతున్నారు. కులం, మతం, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తున్నాయి. తాము ఎవరిని ఎన్నుకోవాలనే నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛనుండి పక్కకు తప్పుకునేట్లు చేస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే నష్టపోయేది అంతిమంగా ప్రజలే.
- బి గంగాధర్‌, ఎడిటర్‌

No comments:

Post a Comment

Dalithashakthi - 2025 - Magazines