దళితశక్తి ప్రకాశం జిల్లా ప్రతినిధి యామర్తి అంజనేయులుపై దాడి చేసిన అగ్రకుల పెత్తందార్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళితశక్తి ఎడిటర్ బి.గంగాధర్, ఆంధ్రప్రదేశ్ సబ్ఎడిటర్స్ నీలం పుల్లయ్య, కళింగ లక్ష్మణరావు, దళితశక్తి విజయవాడ ప్రతినిధి దాసరి రంగనాథ్ ప్రకాశం జిల్లా ఎస్పీని డిమాండ్ చేశారు. పెత్తందార్లు యామర్తి అంజనేయులుపై చేసిన దాడిని దళిత, ప్రజాసంఘాలు, వివిధ సంస్థల మీడియా ప్రతినిధులు ఖండించారు. నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవాల్సి వస్తుందని పోలీసులను హెచ్చరించారు.
No comments:
Post a Comment