Sunday, December 29, 2024

లౌకిక

లౌకిక 
చుట్టూ చింత చెట్టు నీడ.
చెట్టు ఉన్నంత నీడ ఉంది. 
నీడ ఉన్నంత చెట్టు ఉంది. 
చెట్టు విస్తీర్ణం తప్ప మిగతా ప్రదేశం అంతా వెన్నెల కాంతిలో జోగుతూ ఉంది. 
మధ్య రాత్రి ఒంటిగంట కావస్తుంది. మేఘాలు లేని ఆకాశం చంద్రుడు తెల్లగా ఎత్తి కొడుతున్నాడు. చెట్టుకిందె బొందయ్య మామ నిద్ర పోతున్నాడు. మధ్య రాత్రి మేల్క తట్టింది.  అప్పుడే అవతల నుండి చెప్పుల సప్పుడు సన్నగా వినవస్తుంది. భూ కంపనాలను బొందయ్య మామ చెవుల ద్వారా విన్నాడు. ఎవరో మధ్య రాత్రి వస్తున్నాడని పసిగట్టిండు. తనకోసమే వస్తున్నాడని భావించాడు. ఆందోళన పడ్డాడు. ఏమన్నా గాని అని గుత్ప అందుకున్నాడు సైనికుడు ఆయుధం అందుకున్నట్లు.

వాసిరెడ్డి క్రమంగా దగ్గరికి వస్తున్నాడు. మరింత దగ్గరికి వచ్చాడు.  వస్తూనే వాసిరెడ్డి గట్టి మురుకోల కట్టే తెచ్చుకున్నాడు. దగ్గరికి వచ్చే వరకు చెప్పులు దూరంగా సప్పుడు రాకుండా ఇడిసిండు. వచ్చుడు వచ్చుడే వాసిరెడ్డి  ఏటు ఏసిండు. యుద్ధ వాతావరణం అలుముకుని ఉంది. బొందయ మామ ఏ దిక్కు సౌండ్  వస్తుందో గమనించి అటువైపు చేతులకట్టే ఊపుతుండు. కానీ అప్పటికే ఆయం పట్ల దెబ్బలు పడ్డవి.

***            ****    *****

బొందయ్య మామ సంతు జీవితాన్ని జీవిస్తాడు. అందరూ గుడ్డి బొందయ్య అంటారు. మనం భౌతిక నేత్రాలు తెరిస్తే, ఆయన మాత్రం మనోనేత్రం తెరిచిన మనిషి.

పోతులూరి వీరబ్రహ్మం గారి తత్వాన్ని జ్ఞానాన్నీ పాడుతాడు. నమ్ముతాడు 'కూడా'. 

కళ్ళు లేవు గానీ దివ్యసుందరాకారుని వలె కనిపిస్తాడు. బ్రహ్మంగారు అంటే 'కాలజ్ఞానం' అని మనకు తెలుసు. కానీ ఆయన అంతకంటే ఎక్కువే అని నమ్ముతాడు.
 
ఉదయం మూడు గంటలకే లేచి కాల కృత్యాలు తీర్చుకొని, చల్లనీళ్లతోటి స్నానం చేస్తాడు. శివుడిని పూజిస్తాడు. నొసట విభూది రేఖలు దిద్దుకుంటాడు.... ఎందుకో విష్ణువు ఇష్టం ఉండడు. కానీ శివుడు అంటే యమ ఇష్టం.

చూసేవారికి సత్యం ఇలానే, ఈ మనిషి వలె ఉంటుంది అని అనిపిస్తుంది. 
చూస్తేనే నీతి నియమాలతో జీవితము సాగుతుoది అని అనిపిస్తుంది.
శివధర్మ ఉపదేశమే బోధిస్తాడు.

బడికి పోలేదు గాని విన్నది విన్నట్లు చెప్పగలడు. వినికిడి జ్ఞానం ఎక్కువ. 
చూపు లేకుండా దారులు తెలిసిన మనిషి. వినికిడి జ్ఞానంలో దిట్ట.
ఒక్కసారి వింటే మరిచిపోడు. విన్నది విన్నట్లు పూస గుచ్చినట్లు చెప్పగలడు. ఒక్కసారి స్పర్శి తగిలినా, ఆ స్పర్శతోనే  మనిషిని గుర్తుపట్టగలడు. ఏకసంతాగ్రహి.

బొందయ్య మామకు సొంత ఆస్తులు లేవు. కుటుంబం లేదు.స్వార్థం విడనాడివాడు. విలాసం వంతమైన జీవితాన్ని మలంలాగా విసర్జించాలంటాడు.  

అన్ని కులాలు అన్ని మతాలు సమానమే అంటాడు. మనుషులంతా పుట్టుకరిత్యా సమానమే అంటాడు. 
కుల అసమానతలు వద్దంటాడు. ముస్లింలు ఒకప్పుడు ఈ దేశ మూలవాసులే అంటాడు.
'ఏది చెప్పినా బల్లగుద్దినట్లు'.. కాకుండా "గుండెపై గుద్దినట్లు" చెప్తాడు. 
మెదడులో వాస్తవాలు నిక్షిప్తం అయ్యేలా వివరించడం, ఒప్పించడం
ఆయన నైజం.

సంతు జీవితం అన్నాను కదా, పాటను ఆరో ప్రాణంగా భావిస్తాడు. మనసులో కలిగిన జ్ఞానాన్ని పాటగా వ్యక్తపరుస్తాడు. అంటే పాటల ఊట, పాటల చెలిమే.. ఇవేవీ కాదు ఇంకా ఎక్కువే.
ఏకంగా మల్లెల తీర్థపు జలపాతమే అనొచ్చు. మామ పాట వింటే హృదయ పలకo విచ్చుకొని అక్షరాలన్నీ శిలాక్షరాలుగా మారిపోతాయి.  
పాట మస్తిష్కంలో నిక్షిప్తమై, అశోకుని శిలా శాసనాల వలె నిటారుగా ఉండిపోయి ధ్వజస్తంభమై నిలిచిపోతుంది. 

ఆ పాటకు మనిషి కేంద్రం. అసమానతలు లేని మనిషి కేంద్రం. మనుషులంతా సమానమనే భావన. లౌకిక భావన. ఈ దేశ జంబుద్వీప భావన. గణ రాజ్య భావన.

ఆయన పాడే పాటలు ఉయ్యాల వలె ఊగే బతుకులకు ఒక స్థిత ప్రజ్ఞతను భరోసానిస్తాయి. పాటలు ఊహలు కాదంటూ వాస్తవికమై నిలవాలి అంటాడు. ఎవరైనా తప్పు చేసిన మనిషి సలహా అడిగితే 'అప్పు' చేయని, 'తప్పు' చేయని మనిషి
ఎవడంటాడు? సర్ది చెప్తాడు. మళ్ళీ చేయకూడదని ఉపాయం కూడా చెప్తాడు.

ఒకరి ముందు చేయి చాచడు.
తలవంచడు. మద్రామ
సించెట్టు కాడ చింతకాయలకై కావలుంటాడు. ఎండాకాలం మాడిచెట్ల కాడ కావాలుంటాడు. చింతపండు మాడిపండు అమ్మి జీవితం గడుపుతుంటాడు.

చిన్నప్పుడు అమ్మ తల్లి పోసినందుకు ముఖమంతా గుల్లలై ఆరిపోయాక ఆ మచ్చలు అట్లాగే మిగిలిపోయాయేమో... ముఖం నిండా మచ్చల బెందులే. ఎర్రటి కనుగుడ్లు మచ్చల మధ్య మండే సూర్యుడి వలే కనిపిస్తాయి.

గట్టి మురుకోల కట్టే చేతుల ఎప్పుడు ఉంటది. ఆ కట్టెకు కొనన రెండు మువ్వల గజ్జలు కట్టుకుంటాడు.
"ఎందుకూ"...? నడుస్తున్నప్పుడు గజ్జల శబ్దానికి ఎదురుగుండా వస్తున్న వాళ్ళు అలర్ట్గా ఉండడానికి.

ఆయన చేతి కర్రకు ఉన్న గజ్జెలు గిరగిరా భూగోళం లాగా తిరుగుతూ "యుద్ధ నినాదం "చేస్తున్నట్టు ఉంటాయి.
ఆయనతో ఉంటుంటే, ఆయనైపోతాం. మమేకమై తీరుతాం. ఆయనను చూస్తుంటే,  సత్యాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిందే. అన్ని కులాల మతాల కలుపుగోలు కల కనాల్సిందే.

బజారున నడుస్తున్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలే గాని లేక పెద్దలే గాని 'ఒరేయ్ గుడ్డోడా' అని అరిస్తే గుత్ప తీసుకొని ఎదుర్తాడు. 
అట్లా చాలామంది పిల్లలు భయపడతారు. ఇంకా కావల్సుకుని పెద్దలు ఎవరన్నా బనాయిoచినట్లు 'గుడ్డోడా 'అంటే తిరగబడతాడు. మామను చూస్తే నాకు మా ఊరి నేలన నడిచిన ఆత్మగౌరవ జెండా,'తిరుగుబాటు పతాక' అనిపిస్తది.

ఓం శబ్దంనందే ఆకాశము, అగ్ని,గాలి, నీరు పంచభూతాలన్నీ పుట్టినవని నమ్ముతాడు. స్వార్ధము విడనాడిన మనసులో కలిగిన జ్ఞానాన్ని పాట పాడితే ఏదోలేని శక్తి తాకుతుంది హృదయానికి.
తాత్విక ప్రతిభ మాటల్లో ఉట్టిపడుతుంది.
పది నిమిషాలు సంభాషిస్తే జీవితం యొక్క పరమార్థం అర్థమై పోతుంది. నిజాయితీ మాటల్లో ఉట్టిపడుతుంది మాటల్లో. మనుషులందరూ సమానమే అంటారు ఈశ్వరుని దృష్టిలో.
ఈశ్వరుడు జాంబవంతుని "అంశ" అని నమ్ముతాడు.

శరీర వాంఛ కంటే జ్ఞానవాంఛనే మనిషిని ఉన్నతంగా నిలబెడుతుందని చెప్తాడు. 
ఆత్మ దర్శనం, సత్య మార్గం ఆయనకు ఇష్టమైన భావాలు.
తత్వంతో శరీరానికే కాదు మనసుకు కూడా శిక్షణ ఇవ్వగలడు. 
మనిషిని ఆరోగ్యంగా ఉంచగలిగేది "ఆలోచనలే" అని నమ్ముతాడు.

తెల్లవారుజామునే మూడు గంటలకు మేలుకుంటాడు. చక్కని సంగీతం ఆలపిస్తాడు. అదో గొప్ప అనుభూతి. 
బాగా ఫీల్ అయి పాడుతాడు. 
రెండు ఆనంకాయలు ఎండబెట్టి పొట్టి వొట్టి ఎదురు బొంగుతో తుంబురా చేసుకున్నాడు. 
ఆ తుంబురాపై తత్వజ్ఞానం పాడుతూ ఆత్మానందం పొందుతాడు. 
ఆయన పాడుతుంటే చుక్కలు రాలినట్లు చింత ఆకులు రాలుతాయి . సూర్యోదయం కూడా తొందరపడతాడు ఉదయించడానికి.
ఆ రాగం మిస్సవుతానేమోనని ఆతృత.
నిద్రిస్తున్నప్పుడు ఆత్మ, సత్య పోరాటాలు మొదలైపోతాయి బొందయ్య మామలో.

       *       *        *

వాసిరెడ్డి విష్ణు భక్తుడు. చదువుకున్నాడు. కానీ ఊరిలోనే ఉంటాడు. 'జాతీయ వాద' భావాలని చెప్పి మనుషులను కులాలుగా, మతాలుగా విడగొట్టే పనిని సంస్కృతి పేరుతోటి చేస్తుంటాడు.
మొదట 'బత్తాయి' సంస్థలలో పని చేశాడు. నలబై ఎకరాలు 
ఆసామి. ఇద్దరు  జీతాగాలని పెట్టి వ్యవసాయం నడిపిస్తాడు. 

బొందయ్య మామకు ఊరిలో అన్ని కులాల వాళ్ళు ఇచ్చే గౌరవం నచ్చనివాడు. పైగా శైవం అంటే పగ. లౌకిక అనే పదాన్ని సహించడు. కానీ బొందయ్య మామ ప్రభావం వల్ల ఊరు లౌకిక విలువలకు నిలయం. అన్ని కులాల వాళ్లు ఉంటారు.
కుల ధర్మాలను పాటించినా వావి వరుసలతోటి అన్నదమ్ముల వలనే పిలుచుకుంటారు.
అంటరానితనాన్ని పాటించినా సందర్భానుసారంగా  ఆ విలువల్ని పాటించకుండా కూడా ఉంటారు. 
'బత్తాయి' సిద్ధాంతాలను పునికి పుచ్చుకున్న వాసిరెడ్డి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంటాడు. 

అతడు మూలవాసులైన దళితులను బీసీలను లోపల అసహ్యించుకుంటాడు. పైకి మాత్రం 'జాతీయ భావాల'నే వొదులుతుంటాడు.
ముస్లింలు అంటే చెప్పలేనంత ద్వేషం. రాజ్యాంగం అన్నా రాజ్యాంగ విలువలన్నా పూర్తిగా అగౌరవం .

అప్పుడెప్పుడో బాబ్రీ మసీదు విధ్వంసానికి  ప్రారంభమైన రథయాత్రలో చాలా కీలకంగా పాల్గొన్నాడు. అప్పుడప్పుడు బీసీ దళిత యువకులను పిలిచి 'శాఖ' చేయించాడు. బాబ్రీ మసీదును కూలగొట్టాలనేవాడు. ఆస్థానం లో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలంటాడు.
ముస్లింలకు మత స్వేచ్ఛ వద్దంటాడు. ముస్లిమ్స్ కూడా ఈ దేశ వైష్ణవాన్ని ఫాలో కావాలంటాడు.
ఆయన ఆలోచనలు సామాజిక వ్యవస్థ ఉన్నత స్థాయికి చేరనీయకపోగా, కిందికి దిగజారే ప్రమాదం ఉందని తెలిసినా, ఆ ఆలోచనలనే ఇతరులకు ఇంజెక్టు చేస్తుంటాడు.

భారతమాత అంటే చాలా ఇష్టం. కానీ ఊర్లో కింది కులాల ఆడోళ్ళను మాత్రం 
'అసేయ్' ' ఒసేయ్' అని పిలుస్తూ అనుభవించాలని చూస్తుంటాడు. భారతమాత అనే బొమ్మకు ఇచ్చిన విలువ సాటి మనిషికి ఇవ్వడు. బార్డర్ను ప్రేమించినంతగా బార్డర్ లోపల ఉన్న మనుషులను ప్రేమించడు. ఆయనకు దేశమంటే మట్టి. మనుషులు కాదు.

ద్వేషించాల్సింది ప్రేమించాలంటాడు. ప్రేమించాల్సింది ద్వేషించాలంటాడు. కులాల మధ్య ఉన్న, మతాల మధ్య ఉన్న సున్నిత సంబంధాల్ని  ద్వేష సంబంధాలుగా మార్చగలడు. అనైతిక దృక్పథం మెండు. ఇతర మతాల నైతిక దృక్పథాన్ని బొత్తిగా గౌరవించడు. పరమత సహనం లేకపోగా విషాదపు చేష్టలను సృష్టిస్తాడు. అసత్యాన్ని స్వీకరించి సత్యాన్ని తిరస్కరిస్తుంటాడు.

ఊర్లో పీర్లను
ఆడనివ్వకూడదనేది ఆయన ఉద్దేశం. పీర్ల పండుగ మన దేశ పండుగ కాదు.అది ముస్లింల పండుగ. అది మన ఆచారం  కాదనివాదిస్తాడు. మన సనాతన ధర్మంలో ఈ పండగే లేదంటాడు. ఆ మాటకొస్తే వైష్ణం, శైవం విషయంలో దేనినో ఒకదానిని ఎంచుకోమంటే వైష్ణవాన్ని ఎంచుకుంటాడు. శైవాన్ని ఎందుకు ఎంచుకోవు అని ప్రశ్నిస్తే శైవం ఈ దేశ మూలవాసులదని, బహుజనులదని అతనికి తెలుసు. మూలవాసులు అంటే బహుజనులనే అతనికి  ఎరుక కలదు. కాబట్టి మధ్య ఆసియా నుండి వలస వచ్చిన ఆర్య మత ఆచారాలైన వైష్ణవ మతమే అతడు ఈ దేశ మతంగా ఫీల్ అవుతాడు.

    *      *     *
దుస్తులు ధరించేటప్పుడు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఆధునికతవైపు ప్రయాణించకూడదు అని వాదిస్తుంటాడు.సనాతన ధర్మం ప్రకారం భారతీయ దుస్తులనే ధరించాలని గొంతు చించుకుంటాడు. మగ పిల్లలు జీన్స్ పాయింట్ వేస్తేనే ఒప్పుకోడు. ఇంగ ఆడపిల్లలు వేస్తే అసలే ఒప్పుకోడు.
ఆడపిల్లల మీదికి అత్యాచారాలు జరగడానికి వాళ్ళు వేస్తున్నటువంటి దుస్తులే ప్రధాన కారణం అని వాపోతాడు.

కొన్ని రోజుల తరువాత 
అఘోరిని  ఊరికి ఆహ్వానించాడు. ఒంటిమీద నూలు పోగు లేని అఘోరికి నమస్కరిస్తున్నాడు.
మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి అమ్మవారే అఘోరి రూపంలో బయలుదేరిందని ఊరి వాళ్లకు అందరికీ చెబుతున్నాడు. త్యాగమంటాడు. బర్రెబత్తల కనిపించిన మనిషిని దైవ స్వరూపమని కొలుస్తాడు.

     ****         ****

ఎన్నో ఏళ్ల నుండి దళితులను, బీసీలను, ముస్లింలను, ఆయన నమ్మే జాతీయవాద పార్టీల వైపు మళ్ళించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు విఫలమయ్యాడు. 
ఎన్నో కుట్రలు చేశాడు విజయవంతం కాలేదు. కులాల మధ్య, మతాల మధ్య ఎన్నో కొట్లాటలు పెట్టడానికి ప్రయత్నించాడు కానీ కాలేదు.సర్పంచ్ పదవికి పోటీ చేసిండు. ఓడిపోయిండు.
'కారణం ఏమిటా'? అని 
తీక్షనంగా ఆలోచించసాగాడు. బొందయ్య బోధనలే అని నమ్మాడు. లౌకిక భావానికి పునాది బొందయ్య బోధనలే అని  తెలుసుకున్నాడు. 
తను చెప్పే మాట ఎవరూ నమ్మడం లేదు. కానీ బొందయ్య  మాటలు నమ్ముతున్నారని  ఆయనపై ఈర్ష పెంచుకున్నాడు. 
కనుకనే చంపాలనుకున్నాడు. లేకుండా చేయాలనుకుని కుట్రపన్నాడు . 

'లౌకిక' భావాలు ఉన్నవాడు ఈ ఊర్లో ఉండొద్దు.
"వైష్ణవ భావజాలం" ఉన్నవాడే ఉండేలా  ఆయన కోరిక. అందుకే శైవం నశించాలి. శైవం నశించాలి. శైవం బోధించే బోధకులు నశించాలి. సకల చరాచర జీవరాసులు భద్రంగా జీవించాలనే భావన  సరి కాదు. ఒకే ఒక్క సాంప్రదాయం బతకాలి. నిజానికి 'మతం బుద్ధికెక్కితే, బుర్ర అరికాలికి దిగుతుంది' అనేది నిరూపిస్తున్నాడు. మతసామరస్యం కాకుండా, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. కులసామరస్యం కాకుండా, కులాల కుంపట్లు రగిలేస్తున్నాడు.  వైష్ణవం అజేయం అజేయం అంటూ పలవరిస్తున్నాడు.

బొందయ్యను చంపాలనుకున్నాడు.
"ఎందుకూ" ?
"మత ఆధిపథ్యం కోసం"!.
తన గుండెలలో ప్రశ్నలు నిరంతరంగా.. ఆగకుండా 
జ్వలిస్తున్నాయి.పగతో పొడుసుకొస్తున్నాయి.

బొందయ్య పై దాడుల బీభత్సం అప్రతిహతంగా సాగుతున్నది. 
ఏటు మీద ఏటు గుత్ప తీసుకొని వాసిరెడ్డి వేస్తూనే ఉన్నాడు. బొందయ్య మామ నిశ్చష్టుడయ్యాడు. బొందయ్యా అంటే బొందల ఉండాలే. మందిల ఉండొద్దు. ఊర్లో అసలే ఉండొద్దు అని వాసి రెడ్డి మనుసులో అనుకుంటున్నాడు.బలంగా.. మరింత బలంగా దెబ్బలు పడుతున్నాయి.  ఆ రాత్రి పగ రాత్రి.

శిశిర ఋతువు, వసంత
రుతువు ముసలివైపోయాయి. 
గ్రీష్మ రుతువు ప్రవేశిస్తుందో లేదో తెలియదు. 
ఆకు రాలు కాలం వీస్తుంది.ఇక తనకు ఈ భూమి మీద నూకలు ఉన్నాయో లేదో తెలియదు. తనకు రోజులు దగ్గరపడ్డాయని బొందయ్య  తెలుసుకున్నాడు.
'కళ్ళు మూసుకుంటున్నాడు'. కనురెప్పలు వాలిపోతున్నాయి.!కానీ బలవంతంగా నిలబెడుతున్నాడు. అయినా సరే ఆగడం లేదు. మామ కళ్ళల్లో వెన్నెల కాంతి సుడులు తిరుగుతుంది. అంతా అయ్యాక ఆ రాత్రి బొందయ్య మామను ఊరి ముందల షెల్కల నీళ్లు లేని బావిలో దొబ్బిండు.

పంచభూతాలు దగ్గరికైనవి. బొందయ్య మామను, మామ వాక్కును హత్తుకున్నాయి. అన్ని కులాల 'ఐక్యతకు' మూలం నీ మాటే, 
నీ పాటే.  అందుకు "మేము సాక్షులం". 
ఈ లౌకిక భావాలను మేము కాపాడుతామని నీకు మాట ఇస్తున్నామని గాలి 'జుయ్'... 'జుయ్' మంటూ వీస్తూ మైదానంలో యుద్ధ నినాదం చేస్తుంది.
 
- గుడిపల్లి నిరంజన్, నాగర్ కర్నూల్ 
         9493319878

Friday, December 27, 2024

బాబాసాహెబ్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ మై ఫ్యాషన్‌

 సంపాదకీయం 

బాబాసాహెబ్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ మై ఫ్యాషన్‌


భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ బహుముఖ ప్రాభవాన్ని చూపిన మహనీయుడు డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌. ఆయన జీవితం, అభిప్రాయాలు, పోరాటాలు నేటి సమాజానికి మార్గదర్శకాలు. ఆయన ఆశయాలు సమాజానికి వెలుగు, నాకు దిశానిర్దేశం. అంబేడ్కర్‌ చూపిన మార్గమే మాకు స్ఫూర్తి, మా ప్రతి అడుగులో ఆయనే ప్రేరణ. న్యాయం, సమానత్వం, స్వతంత్రత కోసం ఆయన నిరంతరం పోరాటం చేసిన తీరు ప్రతి యువతకు ఆదర్శప్రాయంగా మారింది. డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆశయాలు నేడు కూడా సమాజానికి పునరుజ్జీవాన్ని అందిస్తున్నాయి, అందుకే ఆయన మాకు ఫ్యాషన్‌.

బాల్యం నుంచే అంబేడ్కర్‌ కులవివక్షలను ఎదుర్కొన్నారు. అంటరానితనం వల్ల ఆయనకు చదువు కూడా సులభంగా లభించలేదు. పాఠశాలలో నీటిని తాగే సమయంలోనూ ఎదురైన అవమానాలు ఆయనకు జీవిత పాఠాలుగా మారాయి. ఆ అవమానాలనే ప్రేరణగా మార్చుకుని, నైతిక ధైర్యంతో ప్రపంచంలో అత్యధిక విద్యను పొందిన వ్యక్తిగా నిలిచారు. అమెరికాలో కోలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి డాక్టరేట్లు సంపాదించిన అంబేడ్కర్‌ విద్యార్హతలు నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచాయి. అందుకే ఆయన మాకు ఫ్యాషన్‌.

సామాజిక సమానత్వం కోసం బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చేసిన పోరాటాలు భారతదేశానికి అపూర్వమైన మైలురాళ్లు. కులవివక్ష నిర్మూలనకు ఆయన చేసిన ప్రయత్నాలు సామాజిక న్యాయం వైపు దేశాన్ని నడిపించాయి. మహారాష్ట్రలోని చవ్దార్‌ తాలాబ్‌ వద్ద నీటిని త్రాగే హక్కు కోసం నిర్వహించిన పోరాటం, మనువు ధర్మశాస్త్రాన్ని బహిరంగంగా కాల్చి కులవివక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విధానం ఆయన స్పష్టమైన ధక్పథాన్ని సూచిస్తాయి. అందుకే ఆయన మాకు ఫ్యాషన్‌.

భారతదేశాన్ని స్వతంత్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయన సూచించిన పధకాలు భారత ఆర్థిక చరిత్రలో కీలకమైనవి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి సంస్థల ఏర్పాటు ఆయన ఆర్థిక ప్రతిభకు నిదర్శనం. శ్రామికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఆయన రూపొందించిన విధానాలు నేటికీ ప్రభావవంతంగా కొనసాగుతున్నాయి.అందుకే ఆయన మాకు ఫ్యాషన్‌. అంబేడ్కర్‌ చేసిన విశ్లేషణలు ప్రతీ రంగాన్ని ప్రభావితం చేశాయి. కార్మికుల హక్కులను పరిరక్షించడానికి 12 గంటల పని వ్యవస్థను 8 గంటలకు కుదించడంలో ఆయన పాత్ర అమూల్యమైనది. సామాజిక సమానత్వానికి, ఆర్థిక న్యాయానికి ఆయన చేర్చిన మార్గదర్శక సూత్రాలు నేటికీ సమాజంలో ప్రాధాన్యతను కలిగిస్తున్నాయి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు చట్టసభల్లో సమాన హక్కులు కల్పించడమే అంబేడ్కర్‌ లక్ష్యం. ఆయన రూపొందించిన హక్కుల సంరక్షణతో ప్రజాస్వామ్యానికి స్థిరత్వం ఏర్పడింది. అందుకే ఆయన మాకు ఫ్యాషన్‌.

అంతర్లీనంగా హిందూ మతం సష్టించిన కులవ్యవస్థను నిర్ధారించడానికి, సమానత్వం పునరుద్ధరించడానికి, బౌద్ధమతంలోకి మారిన అంబేడ్కర్‌, సమాజానికి నిజమైన మార్గదర్శిగా నిలిచారు. తన అనుచరులకు కూడా అదే మార్గాన్ని సూచించి సమాజంలో సమానత్వానికి ప్రాధాన్యతను చూపించారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ వంటి మహానీయులను అవమానిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నేతలకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది. అమిత్‌ షా బహిరంగంగా క్షమాపణ చెప్పి, మంత్రిపదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు భారతదేశంలోని 95% బడుగు బలహీన వర్గాల మనస్సులో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శనం. భారత రాజ్యాంగం ప్రతి భారతీయునికి మార్గదర్శనం చేస్తున్నట్లే, ప్రతి సమస్యకు, ప్రతి పోరాటానికి అంబేడ్కర్‌ ఆశయాలు మార్గదర్శనం. సమానత్వం, స్వతంత్రం, సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్‌ చూపిన దారిలో నడవడమే నేటి యువతకు ఫ్యాషన్‌.

- బి.గంగాధర్‌, ఎడిటర్‌

Saturday, October 5, 2024

Articles

 కులవివక్ష నిర్మూలన కోసం ప్రభుత్వ చర్యలు:
దళితుల రక్షణ, న్యాయం & సమాజ ఆవశ్యకత

గోవిందమ్మపై జరిగిన ఈ దాడి, కర్నూలు జిల్లాలో కొనసాగు తున్న కులవివక్షతను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి దాడులు దళితులపై సవరించ బడని విధంగా పునరావతమవు తుండటం, సామాజిక వర్గాల మధ్య ఉన్న ఘర్షణలకు సూచిక. ప్రభుత్వం, న్యాయవిధానం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమవు తున్నాయని విమర్శలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో గతంలో కూడా అనేక దళితులపై దాడులు జరిగాయి. అయినప్పటికీ, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడం వల్ల ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి.

2024 సెప్టెంబర్‌ 12న, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, పెద్ద కడుబూరు మండలం, కల్లకుంట గ్రామంలో అమానుష కులహింస ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో గోవిందమ్మ అనే దళిత మహిళపై అగ్రకులస్థులు అత్యంత దారుణంగా దాడి చేసి, ఆమెను బట్టలు విప్పించి కరెంట్‌ స్తంభానికి కట్టేసి విచక్షణరహితంగా కొట్టారు. ఈ ఘటన భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న కుల వివక్షతకు ఉజ్జ్వల ఉదాహరణగా నిలుస్తోంది. ముఖ్యంగా దళిత మహిళలు ఇంకా అమానుష దాడులకు గురవుతుండటంతో, సామాజిక న్యాయం కొరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఘటన నేపథ్యం

ఈ దాడి వెనుక ఉన్న అసలు కారణం ఆరు నెలల క్రితం జరిగిన కులాంతర వివాహం. మాదిగ కులానికి చెందిన ఈరన్న అనే దళిత వ్యక్తి, చాకలి కులానికి చెందిన నాగలక్ష్మితో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం గ్రామంలోని అగ్రకులస్తులకు అసహనాన్ని కలిగించింది. గ్రామంలో కులవివక్ష గాఢంగా ఉండడంతో, ఈ కులాంతర వివాహాన్ని సహించలేకపోయిన వారు, పోలీసుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఆ పంచాయతీ తీర్పు ప్రకారం, ఈరన్న కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించారు. ఈ క్రమం లోనే, ఈరన్న తల్లి గోవిందమ్మను అగ్రకులస్తులు గ్రామంలో ఉంటే చంపుతామని హెచ్చరించారు. దాంతో గోవిందమ్మ తన కుమారుడితో కలిసి ఎమ్మిగనూరులో ఆరు నెలలు జీవించింది.

దాడి వివరాలు

2024 సెప్టెంబర్‌ 12న, గోవిందమ్మ తన పొలంలో సాగు పనులు చూసుకోవడం కోసం, అలాగే పంట నష్టపరిహారం సంబంధిత వేలిముద్ర వేయడం కోసం గ్రామానికి తిరిగి వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో, గ్రామంలోని అగ్రకుల వ్యక్తులుుతెలుగు కష్ణమూర్తి, బోయ చిలకలడోన లక్ష్మన్న, తెలుగు నరసప్ప మొదలైన వారు ఆమె ఇంట్లోకి చొరబడి బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. దాడికి ముందు, పథకం ప్రకారం, గ్రామ లైన్‌మన్‌ వీరేష్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేశాడు. అనంతరం, గోవిందమ్మను బట్టలు విప్పించి, కరెంట్‌ స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆమె ప్రైవేట్‌ భాగాలపై కూడా దాడి చేయడం, ఆమెను వికలాంగుడితో బలవంతంగా వివాహం చేసేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమైన చర్యలు. తర్వాత ఆమెను హత్య చేయాలని కూడా వారు పథకం వేశారు.

పోలీసుల చర్యలు మరియు లోపాలు

స్థానిక ఎస్‌ఐ ఈ ఘటన గురించి తెలుసుకొని, తక్షణమే అక్కడకు చేరుకుని గోవిందమ్మను కాపాడి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ దాడి తీవ్రతకు సంబంధించిన కేసు సకాలంలో నమోదు కాకపోవడం, అలాగే పోలీసుల పక్షపాతం ధోరణి గమనార్హం. గోవిందమ్మ పోలీస్‌ స్టేషన్‌లో 24 గంటలకు పైగా ఉన్నప్పటికీ, పోలీసులు రాజీ కోసం ప్రయత్నించడం స్థానిక దళిత సంఘాల ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ సంఘాల జోక్యంతోనే, పోలీసులు కదిలి కేసు నమోదు చేసి, తొమ్మిది మంది రజక కులస్తులపై కేసులు నమోదు చేశారు. కానీ, అసలు ప్రధాన నిందితులు తప్పించుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ దాడికి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, దళిత సంఘాలు మరియు మానవ హక్కుల సంస్థలు కర్నూలు జిల్లా పరిధిలో కులదురహంకారంపై తీవ్ర నిరసనలు తెలపడం ప్రారంభించాయి. వారు ఈ ఘటనపై అనేక డిమాండ్లు చేస్తూ, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు:

  • ఈ అమానుష ఘటనలో పాల్గొన్న 35 మంది ప్రధాన నిందితులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.్జ
  • విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి దాడికి సహకరించిన గ్రామ లైన్‌మన్‌ వీరేష్‌పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.్జ
  • కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేసిన ఎస్‌ఐ మరియు ఇతర పోలీసు అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.్జ
  • దళితులపై జరుగుతున్న నిరంతర దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

కులవివక్షపై ఆందోళన

గోవిందమ్మపై జరిగిన ఈ దాడి, కర్నూలు జిల్లాలో కొనసాగు తున్న కులవివక్షతను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి దాడులు దళితులపై సవరించ బడని విధంగా పునరావతమవు తుండటం, సామాజిక వర్గాల మధ్య ఉన్న ఘర్షణలకు సూచిక. ప్రభుత్వం, న్యాయవిధానం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమవు తున్నాయని విమర్శలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో గతంలో కూడా అనేక దళితులపై దాడులు జరిగాయి. అయినప్పటికీ, అధికార యంత్రాంగం సకాలంలో స్పందించకపోవడం వల్ల ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయి.

ఈ దారుణ ఘటన గ్రామీణ భారతదేశంలో ఇంకా ఎంత తీవ్రంగా కుల వివక్ష కొనసాగుతుందనే దానికి నిదర్శనం. గోవిందమ్మపై జరిగిన అమానుష దాడి, కులవిద్వేషం వల్ల దళితులు ఎదుర్కొంటున్న దురదష్టకర పరిస్థితులను మరోసారి ముందుకు తెచ్చింది. ఈ విషయంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, కుల వివక్షతను నిర్మూలించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అత్యవసరం ఉందని దళిత సంఘాలు, మానవ హక్కుల సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

కులవివక్షతను నిర్మూలించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు:

భారతదేశంలో కులవిభజన మరియు దానివల్ల కలిగే వివక్షత సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఉన్నత కులాలు మరియు దళితుల మధ్య ఒక విపరీత వ్యత్యాసాన్ని సష్టిస్తుంది. కులవివక్షను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం అవసరం. ఈ దిశలో తీసుకోవలసిన కొన్ని కీలక చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

1. కఠిన చట్టాలు మరియు అమలు:

ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ/ఎస్టీ (అణచివేత నిరోధక చట్టం) వంటి చట్టాలను రూపొందించింది. అయితే, ఈ చట్టాల కఠినంగా అమలుచేయడం చాలా ముఖ్యం. కులవివక్షపై కేసులు నమోదు చేయడంలో తాత్సర్యం లేకుండా, పోలీసులకు కఠిన నిబంధనలు పాటించడంపై దష్టి పెట్టాలి. కులవివక్షకు పాల్పడిన వారి పట్ల పక్షపాతరహితంగా విచారణ జరపడం మరియు న్యాయం అందించడం. ఎస్సీ/ఎస్టీ చట్టాల కింద కేసులను వేగంగా విచారించే ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయడం.

2. వివక్షను నివారించేందుకు కుల అవగాహన కార్యక్రమాలు:

సమాజంలో కులవిభజనపై అవగాహన కల్పించడం ముఖ్యమైన చర్య. ప్రభుత్వ, పాఠశాల, కళాశాల, మరియు సామాజిక స్థాయిలో కుల వివక్ష తాలూకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. కులవివక్షతకు వ్యతిరేకంగా ప్రచారాన్ని మరింతగా విస్తరించేందుకు మీడియా, సామాజిక సంస్థలు, ఎన్‌జీఓలను ఉపయోగించు కోవాలి. సమానత్వాన్ని ప్రోత్సహించే పాఠ్యాంశాలు విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టాలి.

3. దళితులకు రక్షణ:

దళితులకు కులవివక్ష నుండి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వ చర్యలు మరింత పటిష్టం కావాలి. దళితులు నివసించే ప్రాంతాల్లో సురక్షిత పరిసరాలు కల్పించడం, వారి రక్షణ కోసం ప్రత్యేక పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేయడం. దళితులపై జరిగే దాడులకు సంబంధించిన ఫిర్యాదులను పోలీసులు వెంటనే స్వీకరించి, విచారణ జరపడం. దాడులకు గురైన వారిని రక్షణ ఇవ్వడంతోపాటు, న్యాయ సహాయం, వైద్య సదుపాయాలు వంటి వనరులు సకాలంలో అందించాలి.

4. ఆర్థిక, సామాజిక అభివద్ధి కార్యక్రమాలు:

కులవివక్షత దళితుల ఆర్థిక, సామాజిక అభివద్ధికి అడ్డుకట్ట వేస్తుంది. దళితులకు విద్యా, ఉద్యోగ రంగాలలో మరింత అవకాశాలు ఇవ్వడం, వారి సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉచిత శిక్షణా కార్యక్రమాలు అందించడం. దళిత వ్యాపారాలను ప్రోత్సహించేందుకు రాయితీలు, లోన్‌లు, స్కీమ్‌లు అందించడం. దళితులకు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో తగిన భూమి పంచిపెట్టడం, ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయాన్ని అందించడం.

5. పాలనా యంత్రాంగంలో బాధ్యత:

ప్రభుత్వ యంత్రాంగంలో, పోలీసులు, అధికారులు కుల వివక్షకు పాల్పడకుండా చర్యలు తీసుకోవడం. ప్రభుత్వంలో ఉన్న అధికారులపై, కుల వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసినట్లయితే, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం. పోలీసు వ్యవస్థలో, కులవివక్షను నిరోధించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.

6. సమాజంలో సాంకేతికత వినియోగం:

సాంకేతికతను ఉపయోగించి, కులవివక్షను నివారించడంలో కొత్త మార్గాలను అన్వేషించడం. ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించడం, ఇ-గవర్నెన్స్‌ పద్ధతుల ద్వారా దళితులకు మరింత సౌకర్యాలు కల్పించడం. కులవివక్షతకు సంబంధించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో స్వీకరించడానికి ప్రత్యేక ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయడం. బాధితుల రక్షణ కోసం స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్లు మరియు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్లు అందుబాటులో ఉంచడం.

7. కుల వివక్షపై నివేదికలు, పరిశోధనలు:

విస్తత పరిశోధనలు, సర్వేలు చేయడం అవసరం. కులవివక్షకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం నివేదికలు, సర్వేలు నిర్వహించడం. ఈ నివేదికల ఆధారంగా, ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకునేందుకు, అవసరమైన కొత్త చట్టాలను రూపకల్పన చేయడానికి అనువుగా చూడటం.

కులవివక్షను నిర్మూలించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు కేవలం చట్ట పరిమితులకే కాకుండా, సమాజంలో ఒక సుస్థిర మార్పు తీసుకురావాలి. కుల ఆధారిత వివక్షత పూర్తిగా లేకుండా చేయాలంటే, ప్రభుత్వ చర్యలు పటిష్ఠంగా ఉండటంతోపాటు, ప్రజల అవగాహన, శిక్షణ, మరియు దళితులకు రక్షణ, అభివద్ధి అవకాశాలు పెంపొందించాలి.

- కళింగ లక్ష్మణరావు
సబ్‌ ఎడిటర్‌, ఆంధ్రప్రదేశ్‌
దళితశక్తి మాసపత్రిక

Articles

 దళిత విద్యావంతుల సాంఘిక బహిష్కరణ


''ఎంత చదివినా సరే, కులం చెప్పిన పని చేయాల్సిందే'' అనే వారి భావ జాలాన్ని అవమానించినట్టుగా భావించి, ఆత్మగౌరవాన్ని అణగదొక్కేందుకు కుట్ర పన్నారు. ఈ సంఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు, ఇంకా భారత సమాజంలో దళితులపై కొనసాగుతున్న కులవివక్ష, కులాధిపత్య భావాలు ఏ స్థాయికి చేరుకున్నాయో గుర్తు చేస్తోంది.


వైవిధ్యమైన ప్రపంచంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంత ముందుకు వెళ్లినా, మనుషుల మధ్య ఉన్న కులభేదాలు, కులాధిపత్య భావజాలం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది మారుమూల పల్లెపురాల్లో మాత్రమే కాదు, మహా నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో కూడా కనిపిస్తున్నది. కులవివక్షకు గురైన సంఘటనలు అందులోని వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి.

హైదరాబాద్‌కి కూతపెట్టు దూరంలో ఉన్న మెదక్‌ జిల్లా, మనోహరాబాద్‌ మండలంలోని గౌతోజిగూడ గ్రామంలో జరిగిన ఈ ఘటన దళితులపై కొనసాగుతున్న కులవివక్షను మళ్లీ చూపించింది. స్థానిక గ్రామ పెద్దలు డప్పు కొట్టాలని ఆదేశించడం, దళిత యువకులు ఆ పనిని నిరాకరించడం, సాంఘిక బహిష్కరణ జరగడం వంటి సంఘటనలు దళితులపై ఎంత ఘోరమైన దురాగతాలు జరుగుతున్నాయో తెలియజేస్తున్నాయి.

గ్రామంలో జరిగిన ఘటన

ఈ గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబానికి చెందిన పంచమి శంకరయ్య కుటుంబం గతంలో గ్రామానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో డప్పు కొట్టడాన్ని ఆచరిస్తూ వచ్చేది. శంకరయ్య మరణానంతరం, అతని పెద్ద కొడుకు చంద్రం కొంతకాలం ఈ పని కొనసాగించాడు. కానీ, ఉన్నత చదువులు పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఉద్యోగంచేయడం వల్ల, ఆత్మగౌరవంతో పాటు, వత్తి పనుల వల్ల డప్పు కొట్టడం ఆయనకు కష్టంగా మారింది. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న శంకరయ్య చిన్న కొడుకు అర్జున్‌ కూడా, తనను ఈ పని చేయడానికి ఇష్టపడటం లేదని స్పష్టంగా ప్రకటించాడు.

2024 సెప్టెంబర్‌ మొదటి వారంలో, గ్రామంలోని ఒక వ్యక్తి మరణించాడు. ఈ అంత్యక్రియలకు డప్పు కొట్టమని ఆ కుటుంబాన్ని పిలిచారు. అయితే, వారు ఈ పనిని చేయలేమని చెప్పడంతో, గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 10న, గ్రామంలో జరిగిన పంచాయితీ సమావేశంలో పెద్దలు, చంద్రం, అర్జున్‌ లను ''డప్పు కొట్టకపోతే ఊరిలోంచి బహిష్కరించబడతారు'' అని హెచ్చరించారు.

సాంఘిక బహిష్కరణ

గ్రామ పెద్దలు తమ కులాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, దళిత కుటుంబాన్ని సాంఘికంగా బహిష్కరించారు. ''మీ కుటుంబంతో ఎవ్వరూ మాట్లాడకూడదు, సహాయం చేయకూడదు'' అంటూ తీర్మానం చేశారు. గ్రామంలోని బీసీ, ఎస్సీ కులస్తులు, ఇతర కులాల వ్యక్తులు కూడా ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఆ కుటుంబంతో ఎవరైనా మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు మరియు రూ.5 వేల జరిమానా విధిస్తామని తీర్మానించారు. ఇది కేవలం ఓ కుటుంబాన్ని దూరంగా చేయడమే కాదు, దళితులను కులవివక్షతో అణగదొక్కడానికి చేసిన ప్రయత్నం.

బాధితుల ఫిర్యాదు

ఈ ఘటనను ఎదుర్కొన్న చంద్రం, అర్జున్‌లు తమపై జరిగిన దౌర్జన్యంపై మెదక్‌ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్థానిక అధికారులు, తహసీల్దార్‌ చంద్రశేఖర రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తూప్రాన్‌ సీఐ రంగారావు, ఎస్‌ఐ సుభాష్‌ గౌడ్‌లు గ్రామంలో విచారణ జరిపారు. అయితే, ఈ ఫిర్యాదును అధికారుల తీరు అంత సీరియస్‌గా తీసుకోలేదు. వారు కేవలం పంచాయితీతో సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కౌన్సెలింగ్‌ పేరుతో బాధితులను సర్దిచెప్పే ప్రయత్నం చేయడం, బహిష్కరణను సీరియస్‌గా తీసుకోకపోవడం దళితుల ఆవేదనను మరింత పెంచింది.

అట్రాసిటీ కేసు నమోదు

విషయం హద్దులు దాటడం తో, చంద్రం, అర్జున్‌ ఆ కుటుంబంపై జరిగిన అన్యాయాన్ని అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. 18 మంది వ్యక్తులపై కేసు నమోదైంది, ఇందులో గ్రామంలో అధిపత్యం చెలాయించే పెద్దలు మరియు కొందరు ఎస్సీ వ్యక్తులు కూడా ఉన్నారు. కేసు నమోదైనప్పటికీ, నిందితులు ఇప్పటి వరకు పోలీసుల కళ్లుచూపించకుండా పరారీలో ఉన్నారు. ఈ సంఘటనపై జేఎన్టీయూ ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్ల ఫోరం, హైకోర్టు ఎస్సీ లాయర్ల ఫోరం, కేవీపీఎస్‌ వంటి ప్రజాసంఘాలు తీవ్రంగాస్పందించాయి. బాధితులకు న్యాయం జరగాలని, నిందితులు శిక్షించబడాలని ఈ సంఘాలు ఉద్యమించాయి. ఆగ్రహంతో ఈ సంఘటనపై పోరాడుతూ, పోలీసులు కేసు విచారణ చేయాలని ఒత్తిడి చేశారు. ఈ సంఘటన కేవలం ఒక గ్రామంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు, ఇంకా భారత సమాజంలో దళితులపై కొనసాగుతున్న కులవివక్ష, కులాధిపత్య భావాలు ఏ స్థాయికి చేరుకున్నాయో గుర్తు చేస్తోంది.

ప్రభుత్వం, చట్టాల వైఫల్యం

ఈ సంఘటనలో ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, గ్రామ పెద్దలు చట్టాలు, న్యాయవ్యవస్థ ను పక్కనబెట్టి తమ ఆదేశాలను బలవంతంగా అమలు చేయడమే కాదు, ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూమిని కూడా వాపస్‌ ఇవ్వాలని కులవివక్షతతో డిమాండ్‌ చేయడం. ఈ తీర్మానాలను అమలుచేయడంలో చట్టాలు నిర్లక్ష్యంగా మారడం, సమాజంలో కులాధిపత్య భావజాలం ఇంకా కొనసాగుతుందనే సంకేతాలను ఇస్తోంది.

ఈ సంఘటన కులవివక్ష ఇంకా సమాజంలో ముడిపడి ఉందని గుర్తుచేస్తోంది. డప్పు కొట్టడం వంటి పాతకాలపు వెట్టి వత్తిని నిరాకరించినందుకు, ఒక దళిత కుటుంబం సాంఘికంగా బహిష్కరించ బడటమే కాకుండా, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం, సామాజికంగా ఎంత దారుణ స్థితి నెలకొందో తెలుపుతోంది. సామాజిక న్యాయం కోసం, ఇటువంటి సంఘటనలకు బాధ్యత వహించే పెద్దలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, చట్టాలు కులవివక్షను అరికట్టడంలో మరింత బలంగా ఉండాలని ప్రజా సంఘాలు, న్యాయవ్యవస్థలు చర్చించాల్సిన అవసరం ఉంది.

కులాధిపత్యానికి చెమట పట్టించిన విద్య

గ్రామంలో ఉన్న పెత్తందారులు లేదా గ్రామ పెద్దలు, చంద్రం, అర్జున్‌లు జేఎన్టీయూ వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత విద్య చదివి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకోవడం, ఆత్మగౌరవంతో బతుకు తుండడం తమకిష్టం లేకపోవడం ఈ వివక్షకు మౌలిక కారణం. ఆధిపత్య భావజాలంలో, దళితులు కేవలం వెట్టి వత్తులు లేదా తక్కువ స్థాయి పనులకే అనుకూలంగా ఉండాలని పెత్తందారులు భావిస్తారు. విద్యా అభివద్ధి దళితులకు సమాజంలో ఒక కొత్త గుర్తింపునిచ్చింది. ఇది కేవలం ఆ వ్యక్తుల వ్యక్తిగత పురోగతికే పరిమితం కాకుండా, కులవాదానికి ఎదురుదెబ్బ గా మారింది.

చంద్రం, అర్జున్‌ తమ కుటుంబ సంప్రదాయమైన డప్పు కొట్టడం మానేసి, ఉద్యోగం చేసుకుంటూ ఆత్మగౌరవంతో బ్రతకాలనే సంకల్పం పెట్టుకున్నారు. అయితే, ఇది గ్రామంలోని కులాధిపత్య భావాల పెద్దలకి దురవస్థను తెచ్చింది. ''ఎంత చదివినా సరే, కులం చెప్పిన పని చేయాల్సిందే'' అనే వారి భావ జాలాన్ని అవమానించినట్టుగా భావించి, ఆత్మగౌరవాన్ని అణగదొక్కేందుకు కుట్ర పన్నారు.

కక్షపూరిత చర్య

గ్రామ పెద్దలు డప్పు కొట్టమని ఆదేశించినప్పటికీ, దళిత యువకులు ఆ పనిని తిరస్కరించడం, దీనిపై ఘోషిస్తూ పెత్తందార్లు సాంఘిక బహిష్కరణ విధించడం స్పష్టంగా కనిపిస్తున్న కక్షపూరిత చర్య.పెత్తందార్లు చంద్రం, అర్జున్‌లను ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం తమ కులాధిపత్యానికి ఓ సవాల్‌గా భావించారు. ఒకవేళ, వారు తమ నియంత్రణ నుంచి బయటకు పోయారనే భయం కారణంగా, కులాల ఆధిపత్యం నిలుపుకోవడానికి పెద్ద మనుషులు ఈ కుట్ర పన్నారు.

పెత్తందారులు కేవలం సాంఘిక బహిష్కరణకే పరిమితం కాలేదు, వారిని ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో, వారి కుటుంబాన్ని బహిష్కరించడం మాత్రమే కాకుండా, ఇనాం భూమిని తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. ఇది పూర్తిగా అణచివేతకు పూనుకున్న పద్ధతిగా కనిపిస్తోంది. దళితులు ఆర్థికంగా బలపడితే, వాళ్లు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ప్రేరణ కలిగిస్తుందని తెలుసుకున్న పెత్తందార్లు, వారి భూములను తీసుకోవాలనే కుట్ర పన్నారు. భూములు కోల్పోతే, వారు మళ్లీ వెట్టి వత్తులకే పరిమితమవు తారని భావించడం వారి ప్రేరణ.

పెత్తందార్లకు నచ్చని దళితుల అభివద్ధి

ఈ ఘటనలో ప్రధానంగా విద్య ద్వారా దళితులు సాధిస్తున్న అభివద్ధి కులపెత్తందార్ల ఆధిపత్యాన్ని గండికొట్టడం. ఈ కారణంగా, వారు ఒక కుట్ర పన్నడం ద్వారా దళిత కుటుంబాన్ని బహిష్కరించడమే కాకుండా, గ్రామంలోని ఇతర కులస్తులపై కూడా ఒత్తిడి పెట్టి, ఆ కుటుంబాన్ని ఏకాకి చేయడం, సామాజికంగా దెబ్బతీయాలని ప్రయత్నించడం జరిగింది. కుల పెత్తందార్లకు ఉన్నత చదువులు సాధించిన దళిత యువకులు తమ ఆధిపత్యానికి భయంకరమైన దాడిగా భావించి, ఇలా కక్షతోవ్యవహరించారు. అధికారులు ఈ ఘటనపై తీవ్రతతో స్పందించక పోవడం, కౌన్సెలింగ్‌ పేరుతో బాధితులను సర్దిచెప్పడం, ఈ కుట్రలో పెత్తందార్ల ఉనికి ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం, పెత్తందార్లకు ప్రోత్సాహం అందినట్లుగా కనిపిస్తోంది.

ఈ ఘటన దళితులపై కొనసాగుతున్న కులవివక్షను మాత్రమే కాదు, దళితులు విద్యతో, ఆత్మగౌరవం తో బ్రతకడం ఇంకా కులాధిపత్య భావాల వారికి ఇష్టపడటం లేదనే విషయాన్ని తెలియజేస్తుంది. కుల ఆధిపత్యాలను సమాజంలో నిలిపి ఉంచడానికి దళితులను అణగదొక్కేందుకు కుట్రలు పన్నడం జరుగుతూనే ఉంది.


- సిహెచ్‌ సాయిలు, న్యాయవాది
సబ్‌ఎడిటర్‌, తెలంగాణ
దళితశక్తి మాసపత్రిక

Articles

 బుద్ధ ధమ్మం ఒక పరిచయం

బుద్ధ ధమ్మం అంటే గౌతమ బుద్ధుడి బోధనలు, ఆచారాలు, మరియు తత్వశాస్త్రం. బుద్ధుడు జీవితం, బాధ, విముక్తి (నిర్వాణం) పై తన అవగాహనను ధర్మంగా ప్రచారం చేశారు. బాధ గురించి అవగాహన, బాధకు కారణాలు, బాధ నుంచి విముక్తి సాధ్యమని, మరియు విముక్తి మార్గాన్ని సూచిస్తాయి. అష్టాంగిక మార్గం సమ్యక్‌ దష్టి, సమ్యక్‌ సంకల్పం, సమ్యక్‌ వాక్కు, సమ్యక్‌ కర్మ, సమ్యక్‌ ఆజీవం, సమ్యక్‌ వ్యాయామం, సమ్యక్‌ స్మతి, సమ్యక్‌ సమాధి వంటి అంశాలను కలిగివుంటుంది.

అమెరికా చరిత్ర కారుడు, తత్త్వవేత్త మరియు మతాల చరిత్ర గురించి అవగాహన కలిగిన విల్‌ డ్యురాంట్‌ భగవాన్‌ బుద్ధుని గురించి ఇలా పేర్కొన్నారు ''ప్రపంచం పుట్టటం నిజమైతే ప్రపంచం పుట్టిన తర్వాత ఈ నేలపై నడిచిన వారిలో బుద్ధుడు వంటి మహాత్ముడు మరి ఎవరూ లేరు.'' ఆంగ్ల నవలా రచయిత, పాత్రికేయుడు, సామాజిక శాస్త్రవేత్త మరియు చరిత్రకారుడు హెచ్‌.జి.వెల్స్‌ రచించిన 'చరిత్రలో ముగ్గురు మహనీయులు' అనే పుస్తకంలో బుద్ధుని గురించి ఇలా వ్రాశారు : ''మనం బుద్ధునిలో వెలుతురును అన్వేషించే ఒక సుస్పష్ట మానవమూర్తిని, ఒక సరళ ధార్మిక నిష్టా గరిష్టు, ఒక మానవుని చూస్తాం. ఆయన మానవాళికి సార్వజనీనమైన సందేశాన్ని ఇచ్చారు. అత్యంత ఆధునిక భావాలకు అది చాలా వరకూ దగ్గరగా ఉంది. మన జీవితంలో అసంతప్తులు, కష్టాలు, మన స్వార్థం కారణంగానే వచ్చాయనీ ఆయన చెప్పారు. ఒకడు ప్రశాంత చిత్తులు కావాలంటే ముందుగా, తనకోసం, తన ఇంద్రియ సుఖాల కోసం జీవించటం మానేయాలి. క్రీస్తుకు 500 సంవత్సరాలకు ముందే బౌద్ధం మనుషులకు క్షమాగుణం తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే మనకూ, మన కార్యకలాపాలకు ఆయన చాలా దగ్గరగా వస్తారు .క్రీస్తు కంటే కూడా ఆయన సేవలో వ్యక్తి ప్రాముఖ్యాన్ని, వ్యక్తి అమరుడుగా ఉండాలన్న విషయాన్ని స్పష్టంగా దర్శించారు.''

''నేను జైలులో ఉన్నప్పుడు బుద్ధ ప్రతిమను (విగ్రహాన్ని) గుర్తుకు తెచ్చుకొనేవాణ్ణి. నాకు అది ఒకఉత్తేజక మూలం.'' అని భారతదేశ తొలి ప్రధానమంత్రి అని జవహర్‌ లాల్‌ నెహ్రూ అన్నారు. చాలామంది భగవాన్‌ బుద్ధుని ప్రతిమను చూసి మంచి అనుభూతికి లోనవుతారు. ప్రశాంతతను పొందుతారు. మానవ సమాజ నిర్మాణ శాస్త్రజ్ఞుడైన క్లాడ్‌ లెవి స్ట్రాస్‌ (ఈయన బౌద్ధుడు కానేకాడు) ఈ విధంగా చెప్పారు: ''నేను గురువుల వద్ద నేర్చుకున్నది, చదివిన తత్వ శాస్త్రాలు, సమాజం గురించి చేసిన పరిశోధనలనే కాక పాశ్చాత్య ప్రపంచం గర్వంగా చెప్పుకునే సమస్త శాస్త్రాలనూ, చెట్టుకింద కూర్చొని ఈ మహాముని చేసిన ఆలోచనలతో పోలిస్తే అవి చాలా స్వల్పమైనవి.''

భారతదేశాన్ని గురించి చెప్పేటప్పుడు చరిత్రకారులు బౌద్ధం గురించి పూర్తిగా వివరాలు ఇవ్వలేదు. భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడటానికి కారణం బౌద్ధం. సామ్రాట్‌ అశోకుడు బౌద్ధ చక్రవర్తి. భారతదేశం యొక్క రాజముద్ర సారనాథ్‌లో ఉన్న నాలుగు ముఖాలు గల సింహస్తూపం, అశోక ధమ్మచక్రం. సత్యమేవ జయతే అని వ్రాసి ఉన్న ముద్ర. మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముద్రను విధికుడు అనే చర్మకారుడు క్రీ.శ.1-2 శతాబ్దాలలో అమరావతి స్తూపంపై దానం చేసిన పూర్ణ ఘట శిలాఫలకం కూడా బౌద్ధ ప్రతీక గలది.

అశోకుడు గొప్ప బౌద్ధ చక్రవర్తి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చక్రవర్తి. ఈనాడు మనం ఉప యోగిస్తున్న ధర్మం అనే మాట బుద్ధుని ధమ్మ నుండి వచ్చింది. శ్రీకష్ణుడు భగవద్గీత వ్రాసారని చెబుతారు కానీ బుద్ధుడు ధమ్మపదం బోధించారు అని చెప్పరు. శ్రీకష్ణుడు బోధ అంతా బుద్ధుని ధమ్మ పద నుండి తీసుకుని అటూ ఇటూ మార్చి వ్రాసింది. బుద్ధుని జీవిత కథనే రాముడు కథ అంటూ చెప్పారు. ప్రపంచ దేశాలకు బౌద్ధం విస్తరించింది. నేటికీ విస్తరిస్తోంది. ఆత్మ రక్షణ కోసం కుంగ్‌ పూ, జుడో, కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌లను ఆనాడు బౌద్ధ భిక్షువులు నేర్పారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ మహా విశ్వ విద్యాలయాలు ఆప్ఘనిస్తాన్‌లోని తక్షశిల, బీహార్‌లోని నలంద, ఒదంతపురి, విక్రమశిల, బంగ్లాదేశ్‌ లోని సోమపుర, బెంగాల్‌లోని జగద్దల, ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున కొండ, కాశ్మీర్‌లోని శారదా పీఠం, గుజరాత్‌ లోని వలభ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి/కాశీ, కర్ణాటకలోని మన్యఖేతర, తమిళనాడులోని కంచి, ఒరిస్సాలోని పుష్పగిరి, రత్నగిరి, శ్రీలంకలోని సునేత్రాదేవి పరివెనలు. ఈ విశ్వవిద్యాలయాల ద్వారా నాడు ప్రపంచానికి జ్ఞానం, సద్ధమ్మాన్ని బోధించారు బౌద్ధులు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ధర్మాసుపత్రులను నిర్మించిన బౌద్ధ చక్రవర్తి అశోకుడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే భావనను మొట్టమొదటి సారిగా ఆచరించడం ద్వారా ప్రచారం చేసింది గౌతమ బుద్ధుడు, బౌద్ధులు. డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ కూడా ఈ మూడింటినీ భారత రాజ్యాంగంలో పొందు పరిచారు. మనసు గురించి మొట్ట మొదటి సారిగా చెప్పినది తథాగత బుద్ధుడు. ఈ శరీరం మట్టి, నీరు, నిప్పు, వాయువుతో ఏర్పడుతుంది అని ఇవి వేటికవి విడిపోవడాన్నే మరణం అంటారని చెప్పినది బుద్ధుడు.

ధమ్మ చక్ర ప్రవర్తన ఐదుగురు భిక్షువులతో ప్రపంచానికి శాంతి, అహింస, నైతిక జీవన విధానాన్ని అలవరిచినది బుద్ధుడు. ఈ మానవ జీవితంలో దుఖ: నిర్మూలన చేసుకుని సంతప్తికరమైన జీవితాన్ని సాగించ డానికి, పంచశీలాలను, అరియ అష్టాంగ మార్గాన్ని బోధించినది బుద్ధుడు. మధ్యేమార్గాన్ని ప్రవేశ పెట్టి రాగ, ద్వేష, మోహాలను జయించాలని బోధించినది బుద్ధుడు. నెరవేరని కోరికలు వలన దుఖ:ం కలుగుతుంది అని దుఖ్ఖాన్ని గురించి, దుఖ:నిర్మూలన గురించి మొట్టమొదటి సారిగా చెప్పినది బుద్ధుడు. ఉచిత వైద్యం, ఉచితవిద్య బౌద్ధచక్రవర్తులు అందించారు. బౌద్ధ భిక్షువులు అంటే నిజానికి సమాజం కోసం కషి చేసేవారని, కేవలం కాషాయం ధరించి ఒక భవనంలో ఉంటూ తన ధ్యానం, తన ప్రవచనాలను మాత్రమే బోధించడం భిక్షు లక్షణాలు కాదు. భిక్షువులు ప్రజలలోకి వెళ్ళి బౌద్ధాన్ని నిరంతరం ప్రచారం చేయాలి. ఎందుకంటే ప్రజలు దేవుడు, మాయలు అనే భ్రమలో ఉన్నారు వాళ్ళని నిరంతరం ఎడ్యుకేట్‌ చేసే బౌద్ధ భిక్షువులు లేకపోవడం వలన కూడా బౌద్ధం ప్రజలలోకి వెళ్ళడం లేదు.

''బౌద్ధ మతం మతాలన్నింటి లోకి గొప్పది మాత్రమే గాక గొప్ప సాంఘిక సిద్ధాంతము కల్గినది.'' అని డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. బుద్ధుడు అహింసా సిద్ధాంతాన్ని, పంచసీల ప్రవచనాన్ని మన భారత ఖండం వారికి మాత్రమే కాకుండా ఈ విశాల అనంత విశ్వానికీ, అనంత కాలాలకు అందించారు. నేటి అణ్వస్త్ర కాలంలో సైతం తథాగత బుద్ధ దేవుని అమత ప్రబోధాలు తప్పితే ఇంకేమీ ఈ ప్రపంచంలో శాంతి, సోదరభావాలను నెలకొల్పడానికి ఉపకరించవు. బుద్ధుడు ఈ విశాల విశ్వంలో గల మానవాళికి వెలుగుబాట వేసిన ప్రజ్ఞాననిధి.

మానవునిలో తన మానసిక, శారీరక ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు బుద్ధుడు తన ధర్మాన్ని ఉపదేశించారు. మానవులలో మానసిక, శారీరక స్థితికి సంబంధించిన సత్యాన్ని సశాస్త్రీయంగా తెలుసుకోవడమే బౌద్ధ ధర్మం యొక్క ధ్యేయం. మనిషి నిరంతరం సాధన చేయడం ద్వారా మాత్రమే బుద్ధుని యొక్క ధర్మం, సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం.

బౌద్ధులుగా మారడం అంటే భిక్షువులు అయిపోవాలా? అలా భిక్షువులుగా మారాలని బుద్ధుడు చెప్పలేదు. అలాగే గహాన్ని విడిచిపెట్టి బంధాలను పూర్తిగా వదులుకుని అడవులకు పోవాల్సిన పనిలేదు. మజ్జిమనికాయలో తథాగత బుద్ధుడు ఏం చెప్పారంటే ఒకడు అడవులకువెళ్ళి, సమణ జీవితం గడుపుతూ తన మనసులోని క్లేశాలను (ణవళశ్రీవఎవఅ్‌ర) కలిగి ఉంటాడు. మరొకరు అయితే గహంలో ఉంటూనే నగరంలో రణగొణ ధ్వనులు మధ్య ఉంటూనే సమణుడుగా కాకుండా మామూలు జీవితాన్ని కొనసాగిస్తూ క్లేశాలను వదులుకుని శుద్ధమనస్సుతో వుంటారు. మొదటి వ్యక్తి కంటే రెండో వ్యక్తి గొప్ప అని తథాగత బుద్ధ భగవాన్‌ అన్నారు.

మజ్జిమనికాయ-1 లో వచ్చగత్త అనే ఒక పర్యాటక సమణుడు ఒకసారి భగవాన్‌ బుద్ధునితో ఇలా అడుగుతాడు.''భగవాన్‌ అడవులకు వెళ్ళకుండా నిత్యకత్యాల నుండి విరామం తీసుకోకుండా బుద్ధుని బోధనలను ఆచరణలో పెట్టి నిర్వాణం పొందిన వారు ఎవరైనా ఉన్నారా?'' అందుకు బుద్ధుడు ''ఉన్నారు... ఒకరు కాదు ఇద్దరు కాదు, వందమంది, రెండు వందల మంది కాదు ఐదు వందలు కాదు అనేక మంది గహస్థ జీవితం గడుపుతూ బుద్ధుని బోధనలు విజయవంతంగా ఆచరణలో పెడుతున్నారు. ఉన్నతమైన ఆదర్శ జీవితాన్ని గడుపుతున్న వారు ఉన్నారు. కొందరికి విశ్రాంతి జీవితం అనుకూలంగా ఉండొచ్చు. మరి కొందరికి గహస్థ జీవితం గడుపుతూనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొంద గలిగినప్పుడు భిక్షుసంఘంతో పనేమిటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. భిక్షు సంఘం ఒక ఆదర్శ సంఘం. వీరు తమ విహార జీవితం ద్వారా తాము ఉన్నత స్థితులను చేరడమే గాక గహస్థులకు ఆదర్శంగా ఉండాలి. గహస్థుల సందేహాలను తొలగించాలి. సమాజానికి మార్గనిర్దేశంచేయగలగాలి.

భారతదేశంలో ఉన్న నిరు పేదలకు ఈతిబాధలు ఉన్నాయి. మధ్య తరగతి ప్రజలకు, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ ఒత్తిడి, మానసిక అశాంతి ఎక్కువగా ఉంది. పీడనకు గురైన వాళ్ళందరిలో దుఖఃం ఉంటుంది. నిరుపేదలకు, మధ్య తరగతి ప్రజలకు తమంతట తాముగా అభివద్ధి చెందడానికి అవకాశాలు కానరావడం లేదు. బోధిసత్త్వ అంబేడ్కర్‌ బాటలో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించి బుద్ధుని బోధనలు మనఃస్ఫూర్తిగా ఆచరించడం మొదలు పెట్టినట్లు అయితే మనలో నెలకొన్న దుఖా:న్ని పారద్రోలి స్వయం అభివద్ధి చెందడానికి అవకాశం ఉంది.

డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ క్రైస్తవం, ఇస్లాం, జైన, సిక్కు, హిందూ మాతాలను చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఈ మాతాలను నిరాకరించారు కూడా. కోట్లాది మంది తన అనుయాయులను బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించాలని సలహా ఇచ్చారు. భారతదేశంలో ఉన్న పేద, మధ్య తరగతి ప్రజలకు బౌద్ధం ఎంతగానో మేలు చేయగలదు. మార్క్స్‌ వర్గ పోరాటం, క్రైస్తవం, హిందూ మతం వంటివి పీడిత ప్రజలకు ఎలాంటి మేలు చేయలేవు. ఒక్క బౌద్ధ ధమ్మం మాత్రమే మేలు చేయగలదు.' బుద్ధుడు సమస్త ప్రాణులు కొరకు అమితమైన ప్రేమానురాగాలు అలవరచుకున్నారు. ఆయన ప్రేమకు, కరుణకు, దయకు, సమత భావాలకు అవధులు లేవు. ఒక తల్లి తన బిడ్డను రక్షించుకొనేందుకు తన ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుందో అదేవిధంగా బుద్ధుడు కూడా సకల ప్రాణుల కోసం ఎంత గానో త్యాగం చేశారు. బుద్ధుని ఉప దేశాలు శత్రుత్వం లేకుండా ప్రపంచ మంతటా వ్యాప్తి చెందాయి.' బుద్ధుడు ఈ జీవితంలో ఈ భూమిమీదనే ముక్తి (మోక్షం) పొందడం ఎలా అనేది బోధించారు. మనిషి మరణించిన తరువాత స్వర్గం లేదా పరలోకంలో ముక్తి ఉంటుంది అని నమ్మించలేదు. ప్రపంచ దేశాలన్నింటికీ బౌద్ధం సరణ్యం.

మనిషి పుట్టిన వంశం లేదా కులం (వర్ణం) వలన గొప్ప వాళ్ళు అవుతారు అనేది నిజం కాదు. జన్మను బట్టి గౌరవించడం కాదు. మనిషిలో ఉన్న సుగుణాలను బట్టి గౌరవించాలి. బుద్ధుడు తన శిష్యులు అందరికీ ఇదే చెప్పారు. మీరందరూ సమానమే అని అన్నారు. వశిష్టుడు అనే బ్రాహ్మణునితో బుద్ధుడు ఇలా అన్నారు ''ఉన్నతమైన ఆదర్శాలు ముఖ్యం కాని ఉన్నతమైన కులంలో జన్మించడం కాదు.'' ఈ ప్రపంచంలో మనుషులకు మహత్యాలు, మానవాతీత శక్తులు ఉండవు అని బుద్ధుడు స్పష్టం చేశారు.'' ఎదుటివారు ఎలా ఉన్నారో నీవు అలా ఉండాలని, నీవు ఎలాఉండాలని అనుకుంటున్నావో నీ ఎదుటి వారు కూడా అలా ఉండాలని భావించు'' అని బుద్ధుడు అన్నారు.

''తన ధర్మాన్ని మాత్రమే గౌరవిస్తూ ఇతర ధర్మాలను తూలనాడటం కూడదు. కారణానేకాల వల్ల యితర ధర్మాలను సైతం గౌరవించాలి. ఈవిధంగా ప్రవర్తించే వాడు తన ధర్మాన్ని వికసింపజేసు కోవడం మాత్రమే కాక ఇతరుల ధర్మాలకు సైతం సాయపడతాడు. వేరుగా ప్రవర్తించినవాడు తన ధర్మానికి తానే గోతిని త్రవ్వడమే కాక యితరుల ధర్మాలకూ హాని కల్గిస్తాడు. తన ధర్మాన్ని గౌరవించి యితర ధర్మాలను తూలనాడే వాడు తన ధర్మం పట్ల గల శ్రద్ధాభక్తుల వల్ల అలా చేస్తున్నానని అనుకొంటాడు. ''నేను నా ధర్మానికి పేరు తెస్తాను.'' కానీ ఈ ప్రవర్తన వల్ల అతడు తన ధర్మానికి గొప్పహాని చేసిన వాడవుతాడు. అందువల్ల ఒదిగి ఉండటమే గొప్పది (సమవాయ ఏవ సాధు). అందరూ వినండి! యితరులచే ప్రవచితమైన ధర్మాలను వినడానికి సిద్ధంగా ఉండండి.'' (అశోక శిలా శాసనం, సంఖ్య.12)

హింస చేయవద్దని బౌద్ధం చెబుతోంది. బౌద్ధమతం ఆసియా ఖండ మంతటా వ్యాప్తి చెందింది. ప్రపంచ వ్యాప్తంగా నేడు బౌద్ధం శాంతియుతం గా విస్తరిస్తోంది. చాలామంది నేను హిందువును, నా మతం కోసం, నా ధర్మం కోసం నేను ఇతర మతాలలోని లోపాలను ఎత్తి చూపుతాను అంటూ బూతులు తిడుతూ సోషల్‌ మీడియాలో కనబడుతున్నారు. కొంతమంది అయితే దాడులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇది సరైన పద్ధతి కానేకాదు. ఇలాంటి మత ఉన్మాదుల వలన వాళ్ళ ధర్మానికి మతానికి ఎక్కువ నష్టం జరుగుతుందని వారికి అర్థం కావడం లేదు. ఇలాంటి వారిని చూసి అంబేడ్కరిస్టులు మరియు బౌద్ధులు అని చెప్పుకొనే కొంతమంది మిడిమిడి జ్ఞానం గలవాళ్ళు నిజానికి వీళ్ళు ఈ సిద్ధాంతాలను ఆచరించడం లేదు. ఏదో సోషల్‌ మీడియాలో వ్రాతలకు పరిమితమైపోతున్నారు. వీళ్ళు అసలు ధర్మం గురించి అధ్యయనం చేయకుండా, అంబేడ్కరిజాన్ని కూడా అర్థం చేసుకో కుండా హిందువులపై పదేపదే విరుచుకుపడుతున్నారు. మరి అంబేడ్కరిజాన్నీ, బౌద్ధాన్ని ఈ దేశంలో లేకుండా చేస్తూ దళితులలో క్రైస్తవ మతం ముసుగులో ఏసుక్రీస్తు ముసుగులో అజ్ఞానాంధకారాన్ని మరియు మూఢనమ్మకాలు చొప్పిస్తుంటే మాత్రం దానిని ప్రశ్నించడం లేదు. కానుకలు పేరుతో పరాన్నభుక్తులు పెరిగిపోతూ సమాజంలో మతం ముసుగులో చేస్తున్న పనులను ప్రశ్నించవద్దని అలా ప్రశ్నిస్తే మనకు వాళ్ళుదూరం అవుతారని అంటున్నారు. ఎవరైనా సహేతుకంగా ప్రశ్నిస్తే దళిత క్రైస్తవ వ్యతిరేకి అంటూ ముద్ర వేస్తున్నారు. అసలు నిజమైన అంబేడ్కరిస్టు క్రైస్తవుడు అసలే కాడు.

బౌద్ధం మనుషులకు మత పిచ్చిని తలకెక్కించి సంకుచిత చట్రాలలో బంధించి ఉంచేది కాదు. అది సత్య ధర్మాల, జ్ఞాన భావాల విప్లవం. అడవిలోని అన్ని జంతువుల పాదముద్రలు ఏనుగు పాదముద్రలో ఇమిడి పోయినట్టు - లోకంలోని అన్ని కుశల ధర్మాలు గౌతమ బుద్ధుని ధమ్మంలో ఇమిడి పోతాయి. ఒకసారి సారిపుత్ర భిక్షువు, గౌతమ బుద్ధుని ప్రశంసించుతూ... భగవాన్‌ మీ అంతటి మహాజ్ఞాని ఈ లోకంలో ఇంతకు ముందు పుట్టలేదు, ప్రస్తుతం లేరు, ఇకపై పుట్టబోరు. అని ఉదానం చేశాడు. ఆ ప్రశంసను గౌతమ బుద్ధుడు ఖండించి... సారిపుత్రా... అలా అనవద్దు. ఈ లోకంలో గొప్ప జ్ఞానులు నాకు పూర్వం ఉన్నారు, నా తర్వాత కూడా పుడతారు అని చెప్పాడు. బౌద్ధం అంటే మానవత్వం. బౌద్ధాన్ని ప్రేమించటమంటే మానవత్వాన్ని ప్రేమించటం. మానవత్వాన్ని ప్రేమించకుండా బౌద్ధాన్ని ప్రేమించటంలో అర్థం లేదు.

మానవత్వాన్ని, నైతిక విలువలను, జీవకారుణ్యాన్ని, సంఘ సమైక్యతను ఎవరు ప్రబోధించినా, ఏ మతం సూచించినా, ఏ సిద్ధాంతం వాటిని ప్రతిపాదించినా వాటి వరకు మనం వాటిని స్వాగతించాలి, గౌరవించాలి. బుద్ధుని కాలం నుండి మత సామరస్యాన్ని పాటించటమనేది బౌద్ధుల సుసాంప్రదాయంలో ఒకటిగా వస్తుంది. మీ మతం మీదే - మా మతం మాదే అంటూ బౌద్ధులు మత వాదులులాగా దడులు (గీరి గిసుకుని) కట్టుకుని జీవించరు. దేశంలో మత విద్వేషాలు పెచ్చరిల్లుతున్న నేటి తరుణంలో పలు మతాల మధ్య సామరస్యం, సహౌదర భావం నెలకొలిపే ఏ చిన్న ప్రయత్నమైనా కుశలమైనదే. అది సమాజానికి శ్రేయోదాయకమైనదే.

మంచిని పెంచు - చెడును త్యజించు

''దేశాధినేత లేక రాజు అతని మంత్రులు అధికార గణం అధర్మ పరులు, అవినీతిపరులు అయినప్పుడు, దేశం మొత్తం అవినీతి మయమై పతనమై దుఖఃలో కూరుకు పోతుంది.'' అని తథాగత గౌతమ బుద్ధుడు హెచ్చరించారు. ఈనాటి సమాజంలో రాజకీయ నాయకులు, ఆ నాయకుల కు అనుచరులుగా ఉన్న చిన్న చిన్న నాయకులు దాదాపుగా అధర్మపరులు, పదవులు కోసం, డబ్బులు కోసం, భూములు, స్థలాలు కోసం, కార్లలో తిరగాలని, ఖరీదైన బట్టలు ధరించాలని, ఖరీదైన భోజనం తినాలని, విలాసవంతమైన జీవితం సాగించాలని, తమ పిల్లలకు ఆస్తులు, పదవులు, ఉద్యోగాలు, వ్యాపారం అప్పజెప్పాలని తాపత్రయంతో 'నీతి' అనే దాన్ని మరచిపోతున్నారు. బుద్ధుని కాలంలో కూడా అధర్మపరులు అయిన పాలకులు ఎక్కువగా ఉండేవారు. ఆ కాలంలో ప్రజలుదోపిడీకి గురయ్యారు. అణచివేత కూడా ఎక్కువగా ఉండేది. శిక్షలు కఠినంగా ఉండేవి. మరణ దండనలు కూడా ఉండేవి. ప్రజలపై పాలకులు ఎక్కువగా పన్నుల భారం వేసి హింసించేవారు. మానవత్వం అనేది లేకుండా రాజరిక పరిపాలన నాడు నడిచింది. ఇలాంటి అమానుషత్వాన్ని చూసి బుద్ధ భగవాన్‌ చలించిపోయారు. బుద్ధుడు సుపరిపాలన కోరుకున్నారు. ఒక దేశం సుఖశాంతులతో విలసిల్లుతూ తుల తూగాలంటే న్యాయబద్ధమైన ప్రభుత్వం ఉండాలి అని బుద్ధ దేవుడు చెప్పారు. ఆయన దశరాజ ధమ్మను ఉప దేశించారు. రాజకీయ నాయకులు, పాలకులు ఈ పది రాజ విధులు ఆచరించాలని సూచించారు.

బౌద్ధంపై మనువాదుల దాడులు, కుట్రలు

మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన చివరి రాజు బహద్రదుడు. ఇతని కాలంలో సేనానిగా ఉన్న పుష్యమిత్ర శుంగుడు అనే బ్రాహ్మణుడు మౌర్య కడపటి రాజు బహద్రదుని హత్య చేసి భారతదేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోనారంభించారు. పుష్యమిత్ర శుంగుడు కాలం నుంచే భారతదేశంలో మనుస్మతి పాలన మొదలైంది. బౌద్ధులను అత్యంత దారుణంగా హింసించి, హత్యలు చేశారు. బౌద్ధారామాలను కూల గొట్టించారు. సమానత, మానవత, దయ, కరుణ, జ్ఞానం పునాదులు గల బౌద్ధ ధమ్మాన్ని ధ్వంసం చేయాలని శుంగులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అందుకోసం ఎందరి ప్రాణాలను సైతం తీయడానికి వెనుకాడలేదు. ఒక్కో బౌద్ధ భిక్షువు తలను నరికి తీసుకుని వచ్చిన వారికి 100 బంగారు నాణాలు వెలకట్టి ఇస్తామని ప్రకటించారు. దీంతో 100 బంగారు నాణాలు బహుమతి పొందడానికి ప్రతి ఒక్కరూ బౌద్ధ భిక్షువులను హతమార్చడం వారి తలలు నరికి బంగారు నాణాలు పొందారు. ఈనాడు మనకు దేవుళ్ళ గుళ్ళ ముందు కనిపించే బలిపీఠాలు నాడు బౌద్ధ భిక్షువులు తలలు నరకడానికి ఉపయోగించినవే.

మనల్ని సష్టించిన వాడు దేవుడు అయితే మళ్ళీ ఆ దేవుడు మనల్ని ఎందుకు బలి కోరతాడు? లేదా జంతువులను ఎందుకు బలి ఇవ్వమని అడుగుతాడు? దేవుళ్ళ గుళ్ళు ముందు బలిపీఠాలు ఏంటి? అని మనం ఆలోచన చేయాలి కదా! కానీ మనం ఏ మాత్రం చారిత్రక స్పహ లేకుండా ఉంటున్నాం. ఆనాడు దేవుని విగ్రహాలు ముందు బౌద్ధ భిక్షువులను తీసుకుని వచ్చి తలలు నరకారు. బౌద్ధులను నాడు బ్రాహ్మణీయ శుంగులు అత్యంత దారుణంగా వెంటాడి, వేటాడి మరీ చంపారు. చరిత్రలో అత్యంత దారుణంగా, కిరాతకంగా బౌద్ధ భిక్షులను హింసించి తలలు నరికిన చరిత్ర శుంగులది. శాంతిని కాంక్షించే బౌద్ధ భిక్షువులు శుంగుల దాడి నుండి తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడానికి నేపాల్‌, సిలోన్‌ మొదలైన దేశాలకు వలసలు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక శుంగులు చేసేది లేక బౌద్ధ భిక్షువులను తరిమిన తరువాత భిక్షువులు లేరు కాబట్టి దేవునికి బలి ఇవ్వడానికి ఏదోకటి కావాలి కదా అందుకే కొబ్బరి కాయను కొట్టడం ప్రారంభించారు. దీనినే ఒక ఆచారంగా ఇప్పుడు పాటిస్తున్నారు చాలామంది. అసలు విషయం తెలియక ఇదొక ఆచారంగా పాటించడం జరుగుతుంది. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ తన రచనలో ఈ విధంగా వ్రాశారు 'చాలామంది బౌద్ధ భిక్షువులు పుష్యమిత్ర శుంగుడు అంటే ఈనాటికీ మండిపడతారు. తిట్టడానికి తప్ప మరోరకంగా పుష్యమిత్ర శుంగుని పేరు ఉచ్చరించరాదని చైనా పండితులు వల్ల తెలిసింది అని పేర్కొన్నారు. క్రీ.శ.528లో పంజాబ్‌లోని సియాల్‌ సియాల్‌ కోటగా పిలువబడే సాకాల రాజధానిగా గల ఉత్తర భారతదేశంలో రాజ్యాన్ని పాలించిన వాడు మిహిరకులుడు. ఇతను కూడా బౌద్ధులపై వ్యతిరేకతతో బౌద్ధ స్థూపాలను, ఆరామాలను ధ్వంసం చేయించాడు. హర్ష చక్రవర్తిని మోసం చేసి, హేయమైన పద్ధతిలో హత్య చేసినట్లుగా చెప్పబడుతున్న అతని సోదరుడు శశాంకుడు కూడా బౌద్ధ వ్యతిరేకత ప్రదర్శించాడు. గుప్త వంశానికి చెందిన శశాంకుడు శివభక్తుడు. బౌద్ధాన్ని నాశనం చేయాలని తన శక్తియుక్తులను వినియోగించాడు. సామ్రాట్‌ అశోకుడు బౌద్ధం పట్ల భక్తితో ఆరాధించిన బుద్ధ గయలోని బోధి వక్షాన్ని కూకటి వ్రేళ్ళతో పెకలించి వేశాడు. పాటలీపుత్రంలోని బుద్ధుని పాదముద్రలు గల రాయిని పగుల గొట్టించాడు. బౌద్ధ విద్యాలయాలను నాశనం చేశాడు. భిక్షువులను చెల్లాచెదురుగా చేశాడు. హిమాలయ పర్వతం వరకూ అతను క్రూరమైన పనులు కొనసాగించాడు అని అంబేడ్కర్‌ బుద్ధుడు-కార్ల్‌ మార్క్స్‌ వ్యాసంలో పేర్కొన్నారు. బుద్ధుడి పేరును కూడా ఆఖరికి ఈ మనువాదులు వదలలేదు. మౌర్యుల కాలం తరువాత ''బుద్ధు'' అని బుద్ధుణ్ణి పిలిచారు. ''బుద్ధు'' అంటే తెలివిలేనివాడు అని అర్థంలో ఉప యోగించడం మొదలు పెట్టారు. క్రీ.శ.7వ శతాబ్ధంలో అశోకుడు నిర్మించిన బౌద్ధ గుహలను మనువాద హిందువులు ఆక్రమించారు. బౌద్ధుల కేంద్రం రాజగృహ, దీనిని కూడా ధ్వంసం చేశారు. రాజగృహలో ఉన్న త్రిపీఠకాల శిలాఫలకాలను హిందూ దేవాలయాల నిర్మాణంలో ఉప యోగించు కున్నారు. క్రీ.శ.9 వ శతాబ్ధంలో శంకారాచార్య నాగార్జున కొండ వద్ద గల బౌద్ధ భిక్షువులను హింసించి తరిమి వేయించాడు. అక్కడ గల బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేయించాడు. ఆచార్య నాగార్జునుడి మరణం కూడా ఒక కుట్రతో జరిగింది. అతని మరణం తరువాత శ్రీ పర్వతంలో బౌద్ధులకు హిందూ మను వాదులకు తీవ్రమైన ఘర్షణ జరిగింది. చైనా యాత్రికుడు హుయాన్‌ త్సాంగ్‌ వ్రాసిన ''సీయూకీ'' గ్రంథం వలన మనకు ఆనాడు అంతర్జాతీయంగా బౌద్ధానికి విశేషంగా పేరు తెచ్చిన నాగార్జున కొండ గురించి అక్కడి నుండే హిందూ దేవాలయాల నిర్మాణం ఎందుకు జరిగింది అనేది కూడా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. క్రీ.శ. 7వ శతాబ్ధంలో అమరావతి అనే బౌద్ధుల విహార్‌ను కూడా హిందూ మనువాదులు హిందూ దేవాలయాలు గా మార్చుకున్నారు. హుయాన్‌ త్సాంగ్‌ రచనల వలన అమరావతి బౌద్ధ విహార్‌ అని దానిని క్రీ.శ.9వ శతాబ్ధం లో ధ్వంసం చేసి అమరలింగేశ్వర స్వామి ఆలయంగా మార్చారు అని తెలుస్తుంది. అంతేకాదు పంచారామాలు కూడా బౌద్ధులవే. బౌద్ధుల స్థూపాలపై శైవ ఆలయాలను కట్టారు. పంచారామాలలో మూడు ఆరామాలపైన శైవాలయాలు రెండు అంతస్థులు కలిగి ఉన్నాయి. మొదటి అంతస్థు కింద బౌద్ధస్థూపం ఉంటుంది. ఆ బౌద్ధ స్థూపం మూసివేయబడి రెండవ అంతస్థులో శైవ దేవాలయ నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర పురావస్తు శాఖ కూడా 1980లో అమర లింగేశ్వర స్వామి ఆలయం కోసం పునరుద్ధరణ సందర్భంలో దేవాలయ పునాదులలో నుంచి, కప్పుల్లో నుంచి బయల్పడిన బౌద్ధ స్థూపాలు, ప్రశాసనాల ఆధారంతో ఇవి ఒకప్పటి బౌద్ధ స్థూపాలు అని రిపోర్టులో పేర్కొన్నారు. శివుని లింగం ఎక్కడా పొడవుగా ఉండదు.ఈ ఆరామాలలో ఉన్న స్థూపాలనే హిందువులు శివుని లింగం అని చెబుతుంటారు. వాస్తవానికి ఇవి బౌద్ధ స్థూపాలు. బసవపురాణంలో కూడా కాకతీయ రాజులు బౌద్ధులను హింసించినట్లు చెబుతుంది. కాకతీయ రాజు గణపతి దేవుడు అనేక బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేయించాడు. ఆంధ్రాలో వీరశైవ మతాన్ని స్థాపించిన మల్లికార్జున పండితుడు కూడా చంరోలు వద్ద బౌద్ధ భిక్షువు చంపించాడు. పల్లి, గుంటుపల్లిలలోని బౌద్ధ క్షేత్రాలు లింగ క్షేత్రాలుగా మార్చేశారు. ఇవే కాదు మహా బలిపురం, బుద్ధ గయ, మధుర దేవాలయాలు, గ్యాలియర్‌, గుజరాత్‌ లోని విమాలాలయం, అజంతా-ఎల్లోరా ,ఆళ్వార్‌, బీహార్‌, మైసూర్‌, కాశ్మీర్‌, ఒరిస్సా వరకూ చాలా బౌద్ధ ఆరామాలు, కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ హిందూ మనువాదులు హిందూ ఆలయాలుగా మార్చేసారు. భారతదేశంలో చాలా ఆలయాలు బౌద్ధ ఆరామాలే. వాటిలో హిందూ దేవుళ్ళవి చెక్కించి పెట్టారు.''భారతదేశ చరిత్ర అంటే బౌద్ధులకు - బ్రాహ్మణులకు మధ్య జరిగిన సంఘర్షణే.'' అని డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అన్నారు.


- అరియ నాగసేన బోధి
ధమ్మ ప్రచారకులు & న్యాయవాది

Tuesday, October 1, 2024

ఆలోచన

 జెండర్ - కులం ఆధారంగా 
హక్కుల నిరాకరణ సమానత్వం- న్యాయం 

ఒక వ్యక్తి యొక్క లింగం, కులం వ్యక్తి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను పొందడంలో పెద్దగా ప్రభావం చూపుతుంది. జెండర్‌ ఆధారంగా ఉన్న వివక్ష, పురుషుడి-మహిళా మధ్య వ్యత్యాసాలను మరింత పెంచుతుంది, అలాగే కులం ఆధారంగా ఉన్న వివక్ష కూడా సమాజంలో అసమానతులను స ష్టిస్తుంది. ఈ అసమానతలు, సామాజిక న్యాయం, సమానత్వం సాధనలో పెద్ద అడ్డంకిగా మారుతాయి.


దళిత వర్గాలకూ, స్త్రీలకూ, మానవ హక్కులు నిరాకరించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంత మాత్రాన స్త్రీలను దళితులుగా చెప్పటం కుదరదు. అది విజ్ఞత కాదు, కానీ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించవలసి ఉంది. సంస్క తి పరంగా పూర్వగాథలు చూస్తే ఒకానొక కాలంలో స్త్రీలను చదువుకోనివ్వలేదు. శూద్ర వర్ణాలనూ చదువుకోనివ్వలేదు. ఈ విషయంలో స్త్రీలనూ, శూద్రులకూ విద్యా విషయకంగా మానవహక్కులు నిరాకరించబడ్డాయి. ఆస్తి విషయం లోనూ ఈ రెండు వర్గాల వారు నిరాదరణకు గురైనవారే. స్త్రీలు పురుషుల అధీనంలో (తండ్రి, భర్త, సోదరుడు లేదా కుమారుడు) ఉండాలి. శూద్రులు, ముఖ్యంగా అతిశూద్రులు, యజమానుల అధీనంలో ఉండాలి. వీరికి స్వంత ఆస్తి ఉండకూడదు, యజమాన్య హక్కులు ఉండవు. పరాధీనమైన జీవితాలు వారివి. ఈ రకమైన పరాధీనతను ఆయా వర్గాలకు అలవాటు చేయడానికి మతపరంగా చాలా ప్రయత్నాలు జరిగాయి. దానినే సంస్క తిగా నమ్మించారు.

''న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి'' అనే నిబంధన అలాగే ప్రచారంలోకి వచ్చింది. వర్ణధర్మాల పరంగా ఆచార న్యాయం శూద్ర వర్గాల స్వాతంత్య్రాన్ని నిషేధించింది. కుల విద్యలకే వారిని పరిమితం చేసింది. విశేష విద్యలు వారికి అందనివ్వలేదు. ఈ కోణంలో సమస్యను చూసినప్పుడు ఆంధ్రమహా భారతంలో మ త సంజీవని విద్య సందర్భం గుర్తుకు వస్తుంది. ఆ కథలోని అంశాలు విస్తృతమైనట్టివీ, ఈ వివక్షపూరిత సంస్కృతికి దారులు వేసినవి.

మ త సంజీవని విద్య గురించి చెప్పుకోవాలంటే, దానితో ముడిపడి ఉన్న చాలా విషయాల గురించి చెప్పాలి. శుక్రాచార్యుని కథ, కచుని వ త్తాంతం, దేవయాని కథ, యయాతి కథ, యదువంశ చరిత్ర గురించి చెప్పుకోవాలి. సంక్షిప్తంగా ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

శుక్రాచార్యుడు అంటే చాలామందికి తెలుసు. ఆయన అసురుల గురువు. అసురులు అంటే ధైత్యులు, రాక్షసులు అని ప్రచారం జరిగింది. సుర-అసుర యుద్ధాలు పురాణ కథలలో ప్రస్తావించారు. దేవగణాలకు, వారి ప్రత్యర్థులైన అసురగణాల మధ్య ద్వేషం, వైరం ఎందుకు వచ్చాయంటే, రాజ్యాధికారం కోసమూ, భూమి కోసమూ. ఈ పోరాటాలు ఆనాది కాలం నుంచీ, అంటే స్వంత ఆస్తి అనే భావన మనిషికి కలిగినప్పటి నుంచీ, జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, రాజ్యాల మధ్య, జాతుల మధ్య, వర్గాల మధ్య కూడా ఇవే పోరాటాలు జరుగుతూ వచ్చాయి. గెలుపు, ఓటముల నుండి ఉన్నత, కులీన సంస్థలు, యాజమాన్య సంస్థలు, సేవక సంస్థలు ఏర్పడ్డాయి. వర్ణం అనే భావన కూడా ఈ సంఘర్షణల నుండే పుట్టుక వచ్చింది.

వర్ణం అనేదానికి సామాజిక శాస్త్రవేత్తలు, భాషా కోవిదులు అనేక అర్థాలు, వివరణలు ఇచ్చారు. అయినా ''వర్ణం'' అంటే ''కులం'' అనే సామాన్య అర్థం లోకంలో స్థిరపడిపోయింది. ప్రాచీన నాగరికతలలో ''వరేణ'' అనే పదం ఉండేది. ''వరేణ'' అంటే మతపరమైన విశ్వాసం. ఒక సిద్ధాంతం మీద నమ్మకం కలిగి ఉండటం. ఎవరైతే తమ ఆత్మను స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుతారో, వారి నమ్మకం, వరణం, వర్ణం అయ్యింది. ఒక నిర్దిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వర్గాన్ని సూచించే పదం ఇది.

మహాభారతం ప్రకారం మానవులంతా ఒకటే వర్ణం. ''ఏకవర్ణ మిదం సర్వం'' అని అక్కడ చెప్పారు. భగవద్గీత ప్రకారమూ అంతే. ఈ స ష్టిలో పుట్టినవన్నీ ప్రక తి ఆధారం గానే పుడుతున్నాయని భగవద్గీత చెబుతోంది.

''సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సంభవన్తి యాః

తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా.'' (14-4) (అన్ని యోనులలో పుడుతున్న శరీరాలకు మూలం ప్రక తి తల్లి, నేను గర్భదానం చేసే తండ్రిని.)

ఈ విధంగా స ష్టిలోని అన్ని ప్రాణులకూ తండ్రి ఒక్కడే, తల్లి ఒక్కతే, ఆమె ప్రక తి. గుణకర్మలను బట్టి చతుర్వర్ణాలను తానే ఏర్పరచానని క ష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.

''చాతుర్వర్ణ్యం మయా స ష్టం గుణకర్మ విభాగశః
తస్య కర్తారమపి మాం విద్యా కన్తార మవ్యయమ్ ॥'' (4-13)

(మనుషుల గుణకర్మల ఆధారంగానే చతుర్వర్ణాలను ఏర్పరచాను. ఈ విభజన సత్వ, రాజస, తమోగుణాల ఆధారంగా వారు చేసే పనులు, పరిగణన ఆధారంగా జరిగింది. కానీ అనంతర కాలపు స్వార్థశక్తులు ఈ పరిగణనను గుణాల ఆధారంగా కాకుండా పుట్టుక ఆధారంగా నిర్ణయించాయి.)

ఈ నేపథ్యంతో మ త సంజీవనీ విద్య వ త్తంగా చెప్పుకోవాలి. ఆ కాలానికి అంటే ఈ కథా కాలానికి వర్ణధర్మాలు స్థిరపడి ఉన్నాయి. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, శూద్రులకు వారు చేయవలసిన పనులు నిర్ధేశించబడ్డాయి. వీరి మధ్య వివాహ సంబంధాలు నిషేధించబడ్డాయి. ఆర్య, అనార్య భేదాలు, రాజులు తమ వంశం సూర్యుడు లేదా చంద్రుడు నుండి వచ్చారని చెప్పుకోవడం వంటి వర్ణధర్మ రక్షణ (ఎవరి పనులు వారు చేసుకోవటం) రాజుల కర్తవ్యంగా ఉండేది. ఇప్పటికీ ఇది ఆచరింపబడదు.

యయాతి చంద్ర వంశపురాజు, నహుఘని కొడుకు, వర్ణధర్మ పరిరక్షణకు పేరు పొందాడు. ''వర్ణధర్మములో గాచుచు వసుధ యెల్ల ననఘ చరితుడై యేలిన నయ్యయాతి'' అనే ప్రశ్న వచ్చిందిబ్రాహ్మణ బాలికను ఎలా పెండ్లి చేసుకున్నాడు? అనే ప్రశ్నకు జనమేజయుడు అనే రాజు అడిగిన ప్రశ్నకు వైశంపాయనుడనే ముని సమాధానంగా కింది వివరాలు ఇచ్చాడు. ఈ వివరాలు మహాభారతంలో ఉన్నాయి (అదిపర్వం - ఆశ్వాసం - 3).

శుక్రాచార్యుడు వ షపర్వుడనే అసుర రాజుకు ఆచార్యుడుగా ఉన్నాడు. ఆయనకు మ త సంజీవనీ విద్య (మరణించిన వారిని తిరిగి జీవింపచేసే విద్య) తెలుసు. అసురగణాల ప్రజలకు ఇతర గణాల వారితో యుద్ధాలు జరుగుతున్న సందర్భాలలో, మరణించిన అసురులను శుక్రుడు తిరిగి బతికిస్తూ ఉండేవాడు. ఈ విధంగా, అసుర బలం ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది. దేవగణాలకు ఆ విద్య తెలియకపోవడం వల్ల వారు నష్టపోతూ ఉండేవారు.

ఈ సందర్భంలో, దేవగణాలు మ తసంజీవనీ విద్య నేర్చుకోవాలనే సంకల్పంతో, బ హస తి కుమారుడైన కచుడిని శుక్రాచార్యుని దగ్గరకు విద్యార్థిగా పంపించారు. బ హస తి దేవగణాల గురువు. దేవగణాలు అంటే ఆర్య గణాలు. స్థానిక తెగలలో నాగ, యక్ష, దైత్య, దానప, రాక్షస, పిశాచ, కిన్నెర, గంధర్వ, గరుడ, పతగ, పన్నాగ జాతుల వారే ఈ ప్రాంతంలో ఉండేవారు. వీరిని పురాణాలలో అసురులు అని పేర్కొన్నారు.

శత్రు వర్గానికి చెందిన కచుడు విద్యార్థిగా శుక్రుని ఆశ్రమంలో ప్రవేశించడం అప్పట్లో అనుహ్యమైన సంఘటన. శుక్రుడు కచుడికి ఆదరంగా ఆహ్వునించాడు. అతడిని అప్పటి గురువులు శిష్యులందరికే సాధారణ విద్య నేర్పుతున్నప్పటికీ విశేష విద్యలు తమ వద్దే ఉంచుకునేవారు.

దేవయాని చాలా తరచుగా కచుని మంచిచెడ్డలు చేస్తూ ఉండేది. కచుడు ఆమె అభిమానం ఆమెకు ప్రత్యేకంగా పూలు, ఫలాలు తెచ్చి ఇస్తుండేవాడు. కచుని వ్యవహార శైలిని అనుమానించిన శుక్రుని ఇతర శిష్యులు కచుడిని చంపి అడవిలోనే వదిలేసి వచ్చారు. అందరితో పాటు కచుడు సాయంత్రం ఆశ్రమానికి తిరిగి రాడా దేవయాని దిగులు పడ్డాయి. తండ్రితో చెప్పింది. శుక్రుడు దివ్యదృష్టితో చూశాడు. తన విద్యాబలంతో కచుడిని బతికించాడు. దేవయాని కచుడి పట్ల ఆకర్షితు రాలవటం గమనించి శుక్రుని శిష్యులు కచుడిని మళ్ళీ చంపారు. ఈసారి అతని శరీరాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి ఆ మద్యాన్ని శుక్రుని చేత తాగించారు.

యధా ప్రకారం కచుడు ఆశ్రమానికి రాక పోవటంతో దేవయాని గాభరా పడింది. మద్యం మత్తులో ఉన్న తండ్రితో చెప్పింది. ''వీళ్ళందరికీ కచుని మీద కోపం ఉంది. వీళ్ళే అతనిని ఏదో చేసి ఉంటారు అన్నది''. మళ్ళీ అతనిని బతికించినా వీళ్ళు మళ్లీ ఏదో చేస్తారు. అతని సంగతి వదిలెయ్యి'' అన్నాడు శుక్రుడు. దేవయాని మొండిపట్టు పట్టింది. అతను వస్తేగాని అన్నం తినన్నది. శుక్రుడు దివ్వదృష్టితో చూసి కచుడు తన ఉదరం లోనే ఉన్నట్లు గమనించాడు. ఆసంగతే కూతురితో చెప్పాడు. కచుడు లేకపోతే తాను బతికనన్నది దేవయాని. కచుడిని బతికిస్తే తాను మరణించవలసి వస్తుందని శుక్రుడు చెప్పాడు. తనకు ఇద్దరూ ముఖ్యమే అంటూ దేవయాని మొండికేసింది. గత్యంతరం లేక శుక్రుడు కచుడికి బతికించాడు. కచుడు గురువు గారి ఉదరంలో బయట పడేదెలా? ఆ సంకట పరిస్థితిలో శుక్రుడు కచునికి మృతసంజీవని విద్య ఉపదేశించాడనే కచుడు గురువుగారి పొట్ట చీల్చుకుని బయటకు వచ్చి మరణించి పడి ఉన్న గురువు గారిని తన విద్యతో బతికించాడనే మహాభారతం చెప్తున్నది. శత్రువర్గపు వాడైన కచునికి మృత సంజీవని విద్య ఉపదేశించే బదులు-శుక్రుడు తన కూతురికే ఆ విద్య ఎందుకు ఉపదేశించలేదు?. స్త్రీలకు విద్యార్హత లేదు. గనుకనే? స్త్రీలకు విద్యార్హత లేకపోయింది. సరే, తన శిష్యులలో ఎవరికైనా ఆ విద్యను ఉపదేశించి ఉండవచ్చు కదా? అలా ఎందుకు చేయలేదు. అంటే ఆ శిష్యులు శూద్ర వర్ణాల వారు గనుక- అసురులు గనక, ఆర్యేతరులు గనుక, అనే సమాధానం చెప్పవలసి వస్తుంది. ''ఆ విద్య వల్లనే శూద్రులు పతనమయ్యారు'' అన్నారు మహాత్మా జోతిరావ్‌ ఫూలే. అది అప్పటి సమాజపు కట్టుబాటు.

స్త్రీలకూ, శూద్రకులాలకూ వేషభాషలలో కొన్ని కట్టుబాట్లు, నిషేధాలు విధించబడ్డాయి. ఈ వాదన చాలా మందికి రుచించక పోవచ్చు. అలాంటి వారిని చార్వాకులుగా ముద్రవేసి దూరం పెట్టటం చరిత్రలో ఉన్న విషయమే.

దేవయాని ప్రేమానురాగాల వల్లనే ఆమె పట్టుదల వల్లనే కచునికి మరణం తప్పింది. అనుకోకుండా మృత సంజీవని విద్య కూడా లభించింది. వచ్చినపని నెరవేరింది. అయితే కచుడు వెంటనే తన నగరానికి వెళ్ళలేదట. చాలకాలం పాటు మామూలుగా శిష్యరికం చేసి గురువు అనుమతి పొంది తన దేవలోకానికి ప్రయాణం కట్టాడు. అప్పుడు దేవయాని కచునితో ''మన మధ్యగల అనురాగం వల్ల మనకు వివాహమయినట్టే లెక్క నేనూ నీతోపాటు వస్తాను'' అన్నది.

''శుక్రుని అనుగ్రహంతో నన్ను కూడా పరిగ్రహించు'' అని అడిగింది. ''నీవు బ్రాహ్మచారివి -నేనూ కన్యనే'' అన్నది. ''మహీదేవ కుల వతంస'' అంటూ కచుని సంబోధించింది. కచునిది బ్రాహ్మణ కులం, అనేది పరోక్షంగా చెప్పినట్టు. వివాహ ప్రసక్తి తేగానే కచుడు అత్యంత విషాదం పొందాడట.'' ఇది లోక నింద్యం-నీవు నాకు సోదరి వంటి దానిని. గురువుకు శిష్యులు పుత్రుల వంటివారు. నీవు గురువు పుత్రికవు నాకు సోదరివి'' అనేశాను. ప్రవర్తన పరంగా అతను సోదర భావంతో ఉన్నాడని దేవయాని ఊహించలేదు. కచుడు సోదర భావంతో మెలిగాడా అనేదీ సందేహమే. తన పని నెరవేరటం కోసమే అతను తన సాన్నిహిత్యం పెంచుకుని ఆమెను భ్రమలో ఉంచాడనేది నిర్వివాదాంశం. మోసం గుర్తించిన దేవయానికి చాలా కోపం వచ్చింది. ''మోసంతో నేర్చుకున్న సంజీవని నీకు పని చేయదు'' అని శాపించింది. ''నాకు పని చేయకపోతే పోనీ, నావల్ల ఉపదేశం పొందిన వారికి పని చేస్తుంది.'' అన్నాడతను. కచుడు-పైగా, ''ధర్మవిరోధం తలపెట్టావు గనక నిన్ను బ్రాహ్మణుడు ఎవడూ వివాహం చేసుకోడు'' అని తనూ శాపం ఇచ్చి వెంటనే దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విద్య అందరికీ నేర్పాడో లేదో తెలీదు.

కచుని శాపం కారణంగా దేవయాని బ్రాహ్మణుడెవరూ పెళ్లి చేసుకోలేదు. ఆ తర్వాత ఆమె 'యయాతి' భార్య అయింది. యయాతి క్షత్రియుడు. ఇది బ్రాహ్మణ క్షత్రియ వర్ణాలు గుణకర్మల చేతనే ఏర్పడిన కాలపు కథ కావచ్చు. అందుకే గురుస్థానాలలో ఉన్న శుక్రుడూ, బృహసృతీ బ్రాహ్మణులయారు. అనంతరకాలపు పరిణామాల వల్ల వాళ్ళ పిల్లలకూ అదే కులం వచ్చింది. అయినా విద్యల విషయం కొచ్చేసరికి బ్రాహ్మణ స్త్రీ అయినా దేవయాని అనర్హురాలైంది. ఇది జెండర్ వివక్ష. శుక్రుని శిష్యులు అసురులూ, స్థానిక జాతులు కావటం వల్ల అనర్హులయ్యారు. ఇది కులవివక్ష - వివక్ష మూలాలు ఇంత పటిష్టంగా ప్రజల మనస్సులలోకి చొప్పించగలిగింది మతవ్యవస్థ.

- డా|| బి.విజయభారతి
ప్రముఖ రచయిత్రి

Articles

  అశోక విజయదశమి 

ధర్మం, అహింస, శాంతి విజయోత్సవం


ప్రజల ధర్మ మార్గం ద్వారా సత్యం, న్యాయం, మరియు శాంతి విలువలను తమ జీవితాలలో అమలు చేయడానికి ప్రోత్సహించబడతారు. అశోక విజయదశమి ద్వారా, మానవతా విలువలను పాటించడం, శాంతి కోసం కశి చేయడం, మరియు సర్వజన సంక్షేమం కోసం పని చేయడంలో ప్రేరణ పొందవచ్చు.

అశోక విజయదశమి అనేది భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖ దినం, ముఖ్యంగా బౌద్ధమతం పట్ల అశోకుని అంకితభావాన్ని, మార్గదర్శకతను స్మరించే పండుగ. అశోకుడు, మౌర్య రాజవంశానికి చెందిన మూడో చక్రవర్తిగా, కేవలం భౌగోళికంగా కాకుండా, ఆధ్యాత్మికంగా మరియు మానవతా విలువల్లో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కాళింగ యుద్ధం తర్వాత అశోకుడు మార్పునకు లోనై, బౌద్ధమతం ద్వారా సత్యం ధర్మం, మరియు అహింసా మార్గాన్ని అవలంబించాడు.

అశోకుని యుద్ధం ధర్మం వరకు మార్పు

అశోకుడు (క్రీ.పూ.304- క్రీ.పూ.232) మౌర్య వంశానికి చెందిన గొప్ప చక్రవర్తి. ఇతని రాజ్యాన్ని వీస్తూ, భారతదేశం నుంచి ఆధునిక ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ వరకు విస్తరించింది. ఇతని ప్రాముఖ్యత కేవలం సైనిక విజయాలలోనే కాదు, అతని రాజ్యపాలన, ప్రజాప్రియ విధానాలలోనూ ఉంది. అశోకుడు మొదట సైనికవీరుడిగా, యుద్ధాలకు, వలసలను స్వాధీనం చేసుకోవడంలో ముందుండేవాడు. కానీ, అతని జీవితంలో జరిగిన కీలక సంఘటన కాళింగ యుద్ధం.

కాళింగ యుద్ధం:

అశోకుడు చరిత్రలో నిశ్చలంగా నిలిచిపోయిన సంఘటన కాళింగ యుద్ధం. క్రీ.పూ.261లో జరిగిన ఈ యుద్ధం అత్యంత ప్రాణ నష్టం కలిగించింది. ఈ యుద్ధంలో సుమారు లక్ష మందికి పైగా మరణించారు, మరో మందిని బందీలుగా తీసుకున్నారు. ఈ యుద్ధానంతరం అశోకుడు యుద్ధ భూమి నుంచి వచ్చిన వార్తలను విన్నప్పుడు, ఆయన మనస్సు లోతుగా ద్రవించింది. యుద్ధం వల్ల ప్రజలకు జరిగిన హింస, నష్టాల ఫలితంగా అశోకుడు తీవ్ర విచారంలో పడ్డాడు. ఈ సంఘటన అతనిని పూర్తిగా మార్చింది. అతను హింసను విడిచిపెట్టి బౌద్ధమతం స్వీకరించాడు. అశోకుడు తన జీవితంలో బౌద్ధమతం బోధనలను పాటిస్తూ, యుద్ధం నుండి సత్యం, ధర్మం మరియు అహింసా మార్గంలో అడుగుపెట్టాడు. ఈ మార్పు కేవలం అతని వ్యక్తిగత మార్పు మాత్రమే కాదు, భారతదేశం మరియు ప్రపంచ చరిత్రలో కూడా ఒక పునర్నిర్మాణ ఘట్టం.

అశోక విజయదశమి ప్రాముఖ్యత:

అశోక విజయదశమి అనేది అశోకుడు బౌద్ధమతం స్వీకరించిన రోజును సూచిస్తుంది. ఈ దినం అశోకుని జీవితం, అతని మార్గదర్శకత్వం, మరియు బౌద్ధమతంలో ఆయన పాత్రను స్మరించే ముఖ్యమైన సందర్భం. బౌద్ధమతం అనుసరించడం ద్వారా అశోకుడు మానవతా, ధర్మం, మరియు సమానత్వం అనే విలువలను తన పరిపాలనలో ప్రవేశపెట్టాడు.

అశోకుని ధర్మ చక్రం:

అశోకుని రాజ్యపాలనలో ధర్మ చక్రం ఒక ప్రముఖ పాత్ర పోషించింది. ఇది సత్యం, న్యాయం, మరియు సర్వజనసమానత్వానికి ప్రతీకగా మారింది. బౌద్ధుల సాంప్రదాయంలో ధర్మ చక్రం బుద్ధుని బోధనల సూచికగా భావించబడు తుంది. అశోకుని రాజ్యపాలనలో ధర్మ చక్రం ప్రజల జీవన విధానంలో నైతిక విలువలు పాటించే విధంగా రూపొందించబడింది. మన జాతీయ పతాకంలో ఉన్న ధర్మ చక్రం కూడా అశోకుని సాంఘిక ధర్మబోధనలకు ఘనమైన నివాళిగా నిలిచింది.

ధర్మబోధనల విస్తరణ:

బౌద్ధ ధర్మాన్ని స్వీకరించిన దేశం తర్వాత, అశోకుడు ధర్మాన్ని మొత్తం, విదేశాలలో విస్తరించే దిశగా పనిచేశాడు. అతను ధర్మ యాత్రలు చేస్తూ, వివిధ ప్రాంతాలకు ధర్మబోధనలను విస్తరించాడు. అశోకుడు అనేక ధర్మ శాసనాలు నిర్మించి, వాటిపై ప్రజలకు ధర్మం గురించి బోధించాడు. ఈ శాసనాలు బౌద్ధమతం బోధనలను సులభంగా అందించండి, అశోకుడి రాజ్యపాలనలో ప్రజల సత్యం, ధర్మం, అహింసా మార్గాలను అనుసరించడానికి మార్గదర్శకంగా ఉంటాయి.

అశోక విజయదశమి పండుగ విశేషాలు

అశోక విజయదశమి బౌద్ధ సమాజంలో మహత్తరంగా జరుపుకునే పండుగ. ఇది బౌద్ధమతంలో ఒక ప్రధాన పండుగగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం ఈ పండుగను గౌతమ బుద్ధుని బోధనలను అనుసరించి, అశోకుడి బోధనలను స్మరించి జరుపుకుంటారు.

బుద్ధుని బోధనలు:

బౌద్ధ ఆరామాలలో బుద్ధుని బోధనలు, ఆయన జీవితాన్ని స్మరించే పూజలు, ధర్మ చక్రం పూజలు జరిగాయి.

త్రిపిటక పఠనం:

ఈ రోజున బౌద్ధుల కోసం త్రిపిటక పఠనం చాలా ముఖ్యమైన ఆచారం. బుద్ధుని బోధనలను వివరిస్తున్న మూడు భాగాల ఈ పుణ్య గ్రంథాలు ఆధ్యాత్మిక పునాది. ఈ గ్రంథాలను పఠించడం ద్వారా బౌద్ధులు తమ ఆధ్యాత్మిక ప్రగతిని బలపరుస్తారు.

మహా సద్భావన పూజ:

అశోక విజయదశమి రోజున సదా, శాంతి, సమానత్వం వంటి వాటిని సూచించే మహాసద్బావన పూజ నిర్వహించబడుతుంది. ఈ పూజ ద్వారా ప్రజల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తారు.

సామాజిక సేవా కార్యక్రమాలు:

అశోక విజయదశమి రోజున ధ్యానం ముఖ్యమైన ఆచారంగా ఉంటుంది. శాంతి, ధర్మం, మరియు సత్యం వంటి విలువలను మనస్సులో నాటడానికి బౌద్ధులు ఈ రోజున ప్రత్యేకంగా ధ్యానం చేస్తారు. అశోకుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని, బౌద్ధులు ఈ రోజు ధర్మ మార్గంలో అడుగుపెట్టి తమ ఆధ్యాత్మికతను బలపరుస్తారు. సామాజిక కార్యక్రమాలు కూడా ఈ పండుగలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బౌద్ధులు దానం చేయడం, పేదలకు సహాయం చేయడం, ఆహారం అందించడం వంటి పనులు చేస్తారు. దీనివల్ల బౌద్ధమతం కేవలం ఆధ్యాత్మిక మార్గం మాత్రమే కాదు, సామాజిక సేవకు కూడా ప్రాముఖ్యతనిస్తుంది.

అశోకుని ధర్మబోధల అంతర్జాతీయ విస్తరణ

అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించిన తర్వాత, తన పాలనా విధానాల్లో ఈ ధర్మబోధనలను విస్త తంగా ప్రచారం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. భారతదేశం నుంచి ఇతర దేశాలకు బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడంలో అశోకుడి కీలక పాత్ర ఉంది. అతను విదేశీ రాజ్య ధర్మదూతలను పంపించి, బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి పథకాలు రూపొందించాడు. ముఖ్యంగా శ్రీలంక, మయన్మార్, నేపాల్, టార్లాండ్ వంటి దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో బౌద్ధమతం విస్తరించడం అశోకుని క షి వల్లే సాధ్యమైంది.

బౌద్ధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి అశోకుడు తన పుత్రుడు మహిందుడు మరియు కుమార్తె సంగమిత్రలను ధర్మదూతలుగా శ్రీలంకకు పంపాడు. వారు శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టారు, ప్రజల సత్యం, ధర్మం, మరియు శాంతి మార్గంలో నడిపించారు. అశోకుని ధర్మదూతల ప్రభావం కేవలం శ్రీలంకతోనే పరిమితం కాకుండా, పశ్చిమ ఆసియా, మసీదోనియా, గ్రీకు రాజ్యాలకు కూడా విస్తరించింది.

అశోకుడు ఈ విధంగా బౌద్ధమతాన్ని ఒక అంతర్జాతీయ మతంగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. అశోకుని ధర్మబోధనలు, ముఖ్యంగా అహింసా మరియు మానవతా విలువలు, ఈ ప్రాంతాల ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుంది.

ధర్మశాసనాలు మరియు స్తూపాలు

అశోకుడు ధర్మశాసనాలను రాజ్యమంతట ప్రవేశపెట్టాడు. ఈ ధర్మ శాసనాలు ప్రాథమికంగా ధర్మానికి సంబంధించిన సందేశాలను కలిగి ఉన్నాయి. అవి సత్యం, ధర్మం, సమానత్వం, శాంతి వంటి విలువలను ప్రజలకు బోధించాయి. ఈ శాసనాలు వివిధ ప్రాంతాలలో రాయబారాల రూపంలో నిలిపి, అశోకుని పాలనా విధానాలు, సత్యసంధత, మరియు ప్రజా సంక్షేమం పట్ల ఆయన కట్టుబాటును తెలియజేసాయి. అశోకుడు కేవలం ధర్మబోధనలను మాత్రమే ప్రచారం చేయకుండా, అనేక బౌద్ధ స్తూపాలు నిర్మించాడు. బౌద్ధులకు ఆధ్యాత్మిక కేంద్రముగా పనిచేసిన ఈ స్తూపాలు, ధర్మమార్గంలో నడిచే ప్రతి బౌద్ధుడి జీవితంలో ఒక ప్రధాన భాగంగా నిలిచాయి. అతను సారనాథ్, సాంచి, మరియు ఇతర ప్రాంతాలలో స్తూపాలను నిర్మించి బౌద్ధమతం పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శించాడు.

బౌద్ధమతం అంతర్జాతీయ చరిత్ర

అశోకుడు తన పాలనా కాలంలో చేసిన అనేక సంస్కరణలు ప్రపంచ చరిత్రలో ఆయనను మహనీయ నాయకుడిగా నిలబెట్టాయి. బౌద్ధమతం ద్వారా ఆయన ప్రపంచానికి ధర్మం, అహింస, మరియు మానవతా విలువలను అందించారు. ఈ ధర్మబోధనలను కేవలం భారతదేశం మాత్రమే కాకుండా, ఇతర దేశాలు కూడా స్వీకరించి, బౌద్ధమతం ప్రపంచ వ్యాప్తంగా ఒక మానవతా మార్గంగా మారింది.

అశోక విజయదశమి ప్రస్తుత ప్రాముఖ్యత

ఇప్పటికీ బౌద్ధులు అశోక విజయదశమిని ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను ప్రపంచంలోని వివిధ బౌద్ధ ఆరామాలు, మఠాలు, మరియు ధ్యాన కేంద్రాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం అశోక విజయదశమి రోజున, బుద్ధుని బోధనలు, అశోకుడి ధర్మబోధలు, మరియు సమానత్వం పట్ల ఆయన చూపిన అంకితభావాన్ని స్మరించుకుంటారు. ఆధునిక బౌద్ధ సమాజంలో ఈ పండుగ ఒక సంఘీభావం, సాంఘిక సమానత్వం, మానవతా విలువలను ప్రదర్శించే సందర్భంగా మారింది. ఈ పండుగకు సంబంధించిన ముఖ్యమైన కార్యాచరణల ధ్యానం, బుద్ధుని బోధనలు పఠించడం, మరియు సామాజిక సేవలు. ధర్మ మార్గంలో నడవడం మాత్రమే కాకుండా, మానవాళికి సహాయం చేయడంలో కూడా ప్రతి బౌద్ధుడు ఈ రోజున తన భాగస్వామ్యాన్ని చూపిస్తాడు.

సామాజిక విలువల సమ్మేళనం

అశోక విజయదశమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ధర్మం, అహింస, మరియు సమానత్వం వంటి మానవతా విలువలపై నిలబడి ఉన్న ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకత. ఈ పండుగ ప్రజల జీవితాలలో ఆధ్యాత్మికతను, సామాజికతను సమ్మేళనం చేస్తుంది. అశోకుని జీవితానికి స్ఫూర్తిగా ఈ పండుగను జరుపుకోవడం ద్వారా, ప్రజలు ధర్మ మార్గం ద్వారా సత్యం, న్యాయం, మరియు శాంతి విలువలను తమ జీవితాలలో అమలు చేయడానికి ప్రోత్సహించబడతారు. అశోక విజయదశమి అనేది భారతదేశం మరియు ప్రపంచానికి చెందిన ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు సాంఘిక పండుగ. అశోకుడు కేవలం ఒక చక్రవర్తి మాత్రమే కాకుండా, ఒక మార్గదర్శకుడిగా కూడా ప్రపంచ చరిత్రలో తన కోసం నిలబెట్టుకున్నాడు. ఈ పండుగ బౌద్ధమతంలో అశోకుడి ధర్మం, మానవతా విలువల విజయాన్ని స్మరించే ఒక గొప్ప సందర్భం.

దుర్గుణాలు, హింస మరియు అన్యాయం నుండి దూరమై, సత్యం, ధర్మం, మరియు శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ పండుగ మనకు నేర్పుతుంది. అశోక విజయ దశమి ద్వారా, మానవతా విలువలను పాటించడం, శాంతి కోసం క షి చేయడం, మరియు సర్వజన సంక్షేమం కోసం పని చేయడంలో ప్రేరణ పొందవచ్చు.

- బి.గంగాధర్
ఎడిటర్, దళితశక్తి మాసపత్రిక

Editorials

అశోక విజయదశమి

అశోక విజయదశమి భారతీయ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ. ఈ రోజు, అశోక చక్రవర్తి జయప్రతాపం మాత్రమే కాకుండా, అతను ప్రపంచానికి చూపిన ధర్మం, అహింస, శాంతి సిద్ధాంతాల విజయాన్ని కూడా జరుపుకుంటారు. అశోకుడి పాలన ధర్మపరంగా, సామాజిక సమతా న్యాయాన్ని ప్రతిపాదిస్తూ ప్రజలందరికీ శాంతి, సుఖాలను అందించింది. ఈ విజయదశమి, మనకు అశోకుడి ఆదర్శాలను గుర్తుచేస్తూ, వాటిని పాటించడానికి ప్రేరణనిస్తుంది. బుద్ధ ధర్మం బుద్ధుని బోధనల ఆధారంగా ఉన్నతమైన సత్యం, ధర్మం, అహింస, మరియు మోక్ష సాధన వంటి విలువలను ప్రోత్సహిస్తుంది. ఇది వ్యక్తిగత శ్రేయస్సుతో పాటు సామాజిక సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని బలపరుస్తుంది. బుద్ధ ధర్మాన్ని అనుసరించేవారు తమ జీవితంలో శాంతిని, సుఖాన్ని, ఇతరులతో సుహ ద్భావం పెంచుకోవడానికి కషి చేస్తారు. సమాజంలో సామాజిక సమతా ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో ఈ ధర్మం కీలకపాత్ర పోషిస్తుంది.


భారత రాజ్యాంగం మనకు సమాన హక్కులు, విధేయతలు, మరియు న్యాయవ్యవస్థను నిర్దేశిస్తుంది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించడంతో పాటు, వివిధ సామాజిక, ఆర్థిక, మరియు రాజకీయ విభేదాలను అధిగమించడానికి మార్గం చూపుతుంది. కానీ, రాజ్యాంగం అమలులో మనం ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్నాము. నేటి సమాజంలో జెండర్ మరియు కులం ఆధారిత హక్కుల నివారణ ఒక ప్రధాన సమస్యగా మారింది. మహిళలు, ఇతర లింగవర్గాలు, మరియు వివిధ కులాల వ్యక్తులు సమాన అవకాశాలు పొందడంలో వెనుకబడి ఉన్నారు. ఈ విభేదాలు వారి వ్యక్తిగత అభివద్ధిని మాత్రమే కాకుండా, సమాజంలోని సమతను కూడా అడ్డుకుంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి శక్తివంతమైన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, మరియు సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతగా మారడం చాలా అవసరం.

సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, మరియు గౌరవం ఇవ్వడం అత్యంత అవసరం. న్యాయ వ్యవస్థను పారదర్శకంగా, భిన్నంగా మారుస్తూ, సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థలను తగ్గించడానికి ప్రయత్నించాలి. సమానత్వం సాధించడానికి విద్య మరియు అవగాహన పాత్ర పోషిస్తాయి. జ్ఞానం మనిషి అభివ ద్ధి, ఆత్మసాక్షాత్కారం, మరియు సామాజిక శ్రేయస్సుకు మార్గం చూపుతుంది.

తెలుగు సాహిత్యంలో దళిత ఉద్యమాలకు మార్గదర్శకురాలుగా నిలిచిన డా||బి.విజయభారతి గారి అకస్మిక మరణం తెలుగు సాహిత్యంలో అపార శోకాన్ని నింపింది. ఆమె రచనలు, ఆలోచనలు, దళిత సమాజానికి కొత్త దారి చూపాయి. ఆమె సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన క షి దళితులకు స్ఫూర్తిదాయకం. ''దళితశక్తి'' మాసపత్రిక ఆమె వారసత్వాన్ని కొనసాగించడానికి క షి చేస్తూ, ఆమె మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Sunday, September 1, 2024

ఆలోచన

మహిళలు - మత వివక్షలు 

మానవ హక్కులు, సమానత్వం, న్యాయం అంటే మనం బలంగా నమ్మాల్సినవి. దేవతల పట్ల, ఆచారాల పట్ల మనం చూపించే గౌరవం, స్త్రీల పట్ల కూడా చూపించాలి. స్త్రీలకు పురాణ సమయాల్లో ఉన్న గౌరవాన్ని, సమాజంలో వారి స్థానం గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది. సమానత్వం, మానవ హక్కులు, ధర్మం అనేవి మనం పాటించాల్సిన మార్గాలు.

మహిళలు సమాజంలో అత్యంత ప్రభావశాలి, ప్రతి ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం తీసుకుంటాము. వివిధ క్షేత్రాల్లో తమ శక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారితో పాటు సమాజంలో ఉన్న అనేక సమస్యలను ప్రతిపాదించడం, పరిష్కరించడం వలన సమాజంలో మహిళ ప్రగతి సాధించవచ్చు. స్త్రీలకు కొన్ని ఆలయాలలోనికీ రానీయరు. వారు కొన్ని సమయాలలో అశుచిగా (బహిష్టు సమయాలలో) ఉంటారనీ, అది పురుష దేవుళ్ళు భరించలేరనీ వారి న్యాయవాదులు వాదిస్తున్నారు. ''అర్థం శరీరస్య భార్యాలా'' అని స్మ తులు చెబు తున్నాయి. శ్రుతుల (వేదాల)లోని సత్యాలనే స్మ తులు, అంటే ధర్మ శాస్త్రాలు చెప్పాయి. పురుషులు ఏ పుణ్యకర్మలు చేసినా భార్యా సహితులై కూడా ధర్మశాస్త్రాలు చెబుతున్నారు. యజ్ఞకర్మలూ, అగ్ని కార్యాలూ, తీర్థయాత్రలూ మినహయింపుగా ఎలా అవుతాయి? అలా జరిపిన యాత్ర అసంపూర్తమే అవుతుంది. పూర్వ సంస్క తిని, పురాణ సంప్రదాయాలనూ తెలిసిన వారెవరూ స్త్రీలను పుణ్యక్షేత్రాలకు దూరం పెట్టాలనే నిర్ణయాన్ని హర్షించారు. పూర్వం యజ్ఞకర్మలలో దేవుళ్ళ భార్యలను సగౌరవంగా ఆహ్వానించారు. దేవుళ్ళ భార్యలను ఉద్దేశించి హవ్యం (హౌమపధార్థం) సమర్పించి నట్లు రుగ్వేదంలో కనిపిస్తున్నాయి (5-వి-4-2-8). ఇంద్రుని భార్య ఇంద్రాణి, అగ్ని భార్య అగ్నాయి, అశ్వినుల భార్యలు రోదసి, ఆశ్విని అనేవారు. వరుణుని భార్య వరుణాని, మునుల వారికి హవ్యం సమర్పిస్తూ మంత్రాలు వల్లించేవారు. వారు వచ్చి తీసుకునేవారు (అని నమ్మవలసిందే). పూర్వ దష్టాంతాలు ఇలా ఉండగా ఆధునిక భక్తులు వివిధ నిబంధనలు పెట్టుకుని తమ అధికారాన్ని చూపించడానికి ప్రయత్నించడం ఏ విధంగా ఉంది?

స్త్రీలు రుతుస్రావ సమయాలలో అపవిత్రంగా ఉంటారనే వాదన ఎప్పుడు మొదలయ్యిందోగాని అది అత్యంత దౌర్భాగ్యకరమైన నమ్మకం. భక్తులు నమ్మే స ష్టికర్త స్త్రీలకు అలా స జించాడనే దానిని స ష్టికర్త పరంగా మన్నించవలసి ఉంటుందనీ సమాజం ఎందుకు అనుకోదు? ఈ విషయంలో ఇంకా లోతుల్లోకి పోయి విచారిస్తే స్త్రీలకు ఆ పాపభారాన్ని అంటగట్టిన వాసు ఇంద్రుడని తెలుస్తుంది. స్త్రీలను ఏదో తక్కువ చేసి చూపించటానికి ఇండియాలోనే ఆ కుట్ర జరిగింది. ఇంద్రుడు తన పాపభారాన్ని ఎదుటి వారికి పంచి ఇచ్చేసి తాను నాయకుడుగా చలామణి అవుతున్నాడు.

ఇంద్రుడు దేవతల రాజు. రాజు చెప్పిందే ధర్మం. రాజు చెప్పిందే న్యాయం. పాలకవర్గాల పాపలన్నిటినీ అమాయక ప్రజలు బలి అవుతున్నప్పుడు గానే ఈ రుతుస్రావ పాపభారాన్ని స్త్రీలు మోస్తే ఉండవలసి వచ్చింది. దీనికి సంబంధించి చాలా కథలున్నాయి. ఉదాహరణకు ఒక్కటి చెప్పుకుందాం. ఇంద్రుడు విశ్వరూపుడనే అసురుని చంపినప్పుడు ఇంద్రునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇంద్రుడు ఒక సంవత్సరంపాటు ఆ పాపం వల్ల వచ్చే కష్టాలు భరించాడు. ఇక భరించలేని దశలో ఆ పాపాన్ని బతిమాలుకుని తన పాపాన్ని ముగ్గురికి బదిలీ చేశాడు.

ఇంద్రుడి పాపం భరించటానికి సహనమూర్తులు ఎవరు దొరుకుతారు? స్త్రీలు తప్ప. భూమి (భూదేవి), చెట్టు, స్త్రీ. ఈ ముగ్గురినే బతిమాలుకుని వారికి కొన్ని మినహాయింపులు ఇచ్చి ఇంద్రుడు (రాజు, మంత్రులు) శిక్ష నుండి బయటపడ్డాడు. ఆ మినహాయింపులు ఇప్పటి ప్రభుత్వ రాయితీల వంటివే. ఆచరణలోకి రావు. ఆ పాపభారం మటుకు చీరకాలం శాశ్వతంగా అనుభవించవలసిందే.
స్త్రీలకు రజోవికారం, ఇంద్రుని పాపం ఫలితంగా వచ్చింది. భూమిని తవ్వటమూ, చెట్టును కొట్టేయటమూ అనే దోషాలు ఆ పాప లక్షణాలే. అయితే భూమి మీద ఏర్పడే గోతులు వాటంతట అవే పూడుకు పోతాయనీ, చెట్లు కొట్టేసినా తిరిగి చిగురిస్తాయనీ ఇంద్రుడు అన్నాడు. కానీ అవి జరుగుతున్నట్లు లేదు. ఈ వేద భాగవతంలో (6-316) ఉంది. ఇంద్రుడు దేవతల రాజు అని నమ్మితే స్త్రీలకు రాజోవికారం. ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దానిని దోషంగా పరిగణించకూడదు.
ఇంద్రుడే చేసిన ఏర్పాటును ఆపచారంగా భావించడం సమంజసమా? శివుడు ఎప్పుడూ భార్య(ల)తోనే కనిపిస్తాడు. అతని అర్థశరీరంలో పార్వతి ఉంటుంది. విష్ణువుకు వక్షస్థలంపై (గుండెల మీద) లక్ష్మి ఉంటుంది. ఒక్కోసారి అవసరమైతే కాళ్లుపడుతూనూ కనిపిస్తుంది. బ్రహ్మకు నాలుకే గాయత్రి. తమ దేవుళ్లను చూసి అయినా భక్తులు మర్యాద నేర్చుకోక పోవటం విచారకరమే.
దేవీశక్తి త్రిమూర్తులకే ఆరాధ్య. అయ్యప్ప తాను స్త్రీ దేవతలనూ స్త్రీలనూ సహించలే నంటున్నాడా? ఈ సందర్భంలో ఇటీవల చదివిన ఒక వ్యాసం గుర్తు వస్తుంది. అది ఒక పురాతన ఆలయం పుణ్యక్షేత్రమే. సముద్రపు ఒడ్డున ఉన్నది. చాలాసార్లు సముద్రంలో ఆ గుడి మునిగిపోతుంది. ప్రతిసారీ అందులోని విగ్రహాలను తెచ్చుకుని మరోచోట గుడి కట్టి ప్రతిష్ఠించేవారు. చెప్పుకోవలసిన విశేషమేమిటంటే ఆ గుడిలో పూజారులే ఉంటారు. పురుషులు మూల విరాట్టును తాకటానికి వీల్లేదు.

ఇది ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో ఉన్న 'పంచుబరాహి' ఊరి ఆలయం. ఇంకో విశేషమేమిటంటే ఈ పూజలు కొన్ని కుటుంబాల దళిత మహిళలే. పూజారితనం అత్తగారి నుండి పెద్దకోడలికి వారసత్వం గా వస్తుంది. పురుషులు గుడిలోపలికి రావచ్చు, కానీ విగ్రహాలను తాకారు. పూర్వం ఒక బ్రాహ్మణ పూజారి విగ్రహాలను నగంగా చూసిన వెంటనే శిల అయిపోయాడట. అప్పటి నుంచీ స్త్రీలే పూజలు చేస్తారు.

ఇక్కడ స్థానిక జాతులు పూజారులుగా ఉన్నారంటే పురోహితులు దాని వెనక ఒక కథ కట్టించి ప్రచారం చేస్తారు. మహాభారత కాలపు కష్ణుడు ఒక శబరుని బాణపు దెబ్బతో దేహం విడిచాడనీ అందుకే శబర పూజ అవసరమైందనీ చెప్పారు. శతహయ గ్రామంలో ఆ ఆలయంలో మూడు రాతి విగ్రహాలు ఉన్నాయి. 'వారాహి' అధిష్ఠాన దైవతం. ఆలయం ప్రధాన ద్వార దగ్గర సింహ శిల్పాలున్నాయి.

ఇక్కడ శబర పూజారిలు మంత్రాలు చదవరు. స్థానిక భాషలోనే తమ పూజలు నిర్వహించారు. స్త్రీలకూ శూద్రులకూ సంస్క తం నిషిద్ధం కదా! సింహ వాహిని అయిన దేవి స్త్రీ శక్తికి ప్రతీక. పూర్వం సంస్క తి అవశేషాలు ఒడిశాలో ప్రస్ఫుటంగా కనబడతాయి. శ తి, గానాది కళలలో స్థానిక జాతులవారు ముందుండేవారు. జగన్నాథ దేవాలయంలో మొదట ఒడిస్సీ న త్యాన్ని ప్రదర్శించినవారు దళితులే. అప్పట్లో ఒడిస్సీ నాట్య కళాకారిణులను 'మహరి' అనేవారు. ఒకప్పుడు మహర్లకే సొంతమైన కళారూపాలను పురోహిత వ్యవస్థ అనంతరకాలంలో చేజిక్కించుకుంది. ఆలయాలలో పురోహిత వ్యవస్థ నిరంకుశంగా తయారైంది.

శబరిమలలో స్త్రీలను అభ్యంతర పెట్టడం తమ సంస్క తిని తాము అగౌరవ పరుచుకోనటమే అవుతుంది. స్త్రీల ఆరాధన హక్కును అంగీకరించడం మన పురాతన సంస్కతికి సత్యాలను గుర్తించడమే కాదు, సమాజంలో సంబంధించిన స్త్రీల స్థాయిని కూడా ఎత్తివేసే ప్రయత్నం. మానవ హక్కులు, సమానత్వం, న్యాయం అంటే మనం బలంగా నమ్మాల్సినవి. దేవతల పట్ల, ఆచారాల పట్ల మనం చూపించే గౌరవం, స్త్రీల పట్ల కూడా చూపించాలి. స్త్రీలకు పురాణసమయాల్లో ఉన్న గౌరవాన్ని, సమాజంలో వారి స్థానం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. సమానత్వం, మానవ హక్కులు, ధర్మం అనేవి మనం పాటించాల్సిన మార్గాలు. స్త్రీలను ఆలయాలకు దూరం చేయడం, వారి పట్ల వివక్ష, సమాజంలో వారి స్థాయిని తగ్గించడమే.
(ఆలోచన పార్ట్-2)

- డా|| బి.విజయభారతి
ప్రముఖ రచయిత్రి

Dalithashakthi - 2025 - Magazines